ఖియామత్ నాడు ఏమి జరుగుతుంది, స్వర్గం మరియు నరకం ఎలా ఉంటాయి అన్న అంశాల పై సంక్షిప్త వివరణ....
మరణించిన తరువాత ఒకరోజు వస్తుంది, ఆ రోజున మరలా అందరికి పునర్జన్మ ప్రసాదించబడుతుంది. ఆ దినం పేరు “ఖియామత్”. ఆరోజు మంచి పనులు చేసిన వారికి పుణ్యం ప్రసాదించబడుతుంది మరియు చెడు పనులు చేసిన వారు శిక్షకు అర్హులవుతారు. మంచి పనులు చేసిన వారు స్వర్గానికి మరియు చెడు చర్యలకు పాలుపడ్డవారు నరకానికి పంపబడతారు.
స్వర్గం: ఇది అన్ని రకాల సుఖాలూ ఉండేటువంటి ప్రదేశం. ఇది అల్లాహ్ అనుగ్రహాలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి కష్టాలు, బాధలు ఉండవు. ఇది పుణ్యాత్ముల శాశ్వత నిలయం.
నరకం: ఇది అన్ని రకాల శిక్షలు మరియు బాధలు ఉండేటువంటి చోటు. ఇక్కడుండే ప్రతీది అనగా తిండీ, పడకా అన్నీ నిప్పుతో కూడినవే. ఇది పాపాత్ముల నిరంతర నిలయం.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
వ్యాఖ్యానించండి