రోమ్(rome)తో యుధ్ధానికి ఒక సైన్యాన్ని సిధ్ధం చేసి ఆ సైన్యానికి ఉసామా బిన్ జైద్ ను నాయకుడిగా నియమించారు...
దైవప్రవక్త[స.అ] తమ మరణానికి రెండు రోజులు ముందు రోమ్(rome)తో యుధ్ధానికి ఒక సైన్యాన్ని సిధ్ధం చేసి ఆ సైన్యానికి “ఉసామా బిన్ జైద్ బిన్” హారిసహ్ను నాయకుడిగా నియమించారు. అతని వయస్సు 18 సం॥లు. ఆ సైన్యంలో అబూబక్ర్, ఉమర్ మరియు అబూ ఉబైదహ్ లాంటి పెద్ద పెద్ద సహాబీయులు, ముహాజిరీన్ మరియు అన్సారుల నుండి ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో కొందరు ఉసామా నాయకత్వంపై “ఇంకా ముఖంపై గడ్డం కూడా మొలవనటువంటి యువకుడిని ఎందుకు మాపై నాయకుడిగా నియమించారు” అని అభ్యంతరం వ్యక్తం చేశారు. దైవప్రవక్త[స.అ]కు సహాబియుల ఈ పరిహాసం మరియు ఎగతాళి విని చాలా కోపం వచ్చింది. వారు తీవ్ర జ్వరంతో ఉన్నప్పటికీ, ఇద్దరి వ్యక్తుల సహాయంతో తమ ఇంటి నుండి బాయటికి కాళ్ళను నేలపై ఈడుస్తూ వచ్చి పీఠం పైకి ఎక్కి అల్లాహ్ స్తుతి అనంతరం “ప్రజలారా! ఈ ఉసామా యొక్క నాయకత్వం గురించి నేను ఏమి వింటున్నాను?. ఇదేమి కొత్తకాదు. మీరు ఇంతకు ముందు ఇతడి తండ్రి యొక్క నాయకత్వం పై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను అప్పుడు జైద్ నాయకత్వానికి అర్హుడు, మరి అతని తరువాత ఇప్పుడు అతని కూమారుడు దానికి తగిన అర్హత కలిగిన వాడు” అని అన్నారు. అయినా సరే ఎవరూ కదల లేదు. [తబఖాతె ఇబ్నె సఅద్, భాగం2, పేజీ190]
వ్యాఖ్యానించండి