.ఇమాములు కూడా సాధారణ మనిషి వలే తప్పులు చేస్తారా లేదా వారు పవిత్రులు అయి ఉండడం అవసరమా?
“ఎవరినైతే అల్లాహ్ హిదాయత్ కోసం ఎన్నుకున్నాడో అతను పవిత్రుడు అయి ఉండాలి” అని బుద్ధీవివేకాలు అంగీకరించవా!?. “తప్పకుండా బుద్ధీవివేకాలు దానిని అంగీకరిస్తాయి మరియు ఇలాంటి వాళ్ళు పవిత్రులై ఉండడం అవశ్యకం” అని అంటాయి. ఎందుకంటే ఎవరికైతే నాయకత్వం మరియు మానవత్వ మార్గదర్శక బాధ్యతను ఇవ్వబడుతుందో అతడు సాధారణ మనిషి వలే అడుగు అడుగునా తడబడూతూ, తెలిసీ తెలియక తప్పులు చేస్తూ, అతని పై తప్పుల భారం ఎక్కువై మరియు ప్రజలు అతడిని అభ్యంతరిస్తూ అతడి లోపములను చెబుతూ ఉండడం అసాధ్యం. దానికి వ్యతిరేకంగా సరళ బుద్ధి తీర్మానం ఏమిటంటే; ఇలాంటి మనిషి తన కాలంలో అందరిలో జ్ఞాని, అందరి కన్న శక్తిశాలి, ధర్మనిష్ఠ గలవాడు అయి ఉండడం అవసరం. ఈ గుణాలతో నాయకుడి ప్రతిష్టత నాలుగింతలు పెరుగుతుంది, ప్రజల దృష్టిలో అతడి గౌరవం పెరుగుతుంది, ప్రపంచం అతడిని గౌరవిస్తుంది. మరి దానికి ఫలితం; ప్రజలు ఎటువంటి ఒత్తిడి మరియు ఇచ్చకములు లేకుండా అతడి ఆజ్ఞను పాటిస్తారు.
వ్యాఖ్యానించండి