దైవప్రవక్త[స.అ.వ] మరియు షైతాను మధ్య జరిగిన సంభాషణ.
ఒకరోజు దైవప్రవక్త[స.అ]ల వారు షైతాన్ తో "ఓరి శపించబడినవాడా! నువ్వు సద్ఖా కు[దానదర్మాలకు] ఎందుకు అడ్డుపడతావు?" అని ప్రశ్నించారు. దానికి షైతాను “ఓ దైవప్రవక్త! ఒక రంపాన్ని నా తలపై పెట్టి నన్ను ఒక చెట్టు మాదిరి ముక్కలు చేయటం ప్రజల సద్ఖా ఇవ్వటాన్ని సహించేకన్నా నాకు సులభతరం[నన్ను ముక్కలుగా చేసే బాధ కన్నా ప్రజల సద్ఖా ఇవ్వటం నన్ను ఎక్కువగా బాధిస్తుంది]” అని అన్నాడు.తిరిగి దైవప్రవక్త[స.అ]ల వారు “వారి[ప్రజల] సద్ఖా ఇవ్వటం నిన్ను ఎందుకు బాధిస్తుంది?” అని అన్నారు. దానికి షైతాను “సద్ఖాలో ఐదు లక్షణాలున్నాయి: సద్ఖా వలన సంపద పెరుగుతుంది, అది వ్యాదిగ్రస్తుల వ్యాదిని నయం చేస్తుంది, దురదృష్టకర విపత్తుల నుండి కాపాడుతుంది,సద్ఖా ఇచ్చేవాళ్ళు సిరాత్ వంతెనను చాలా త్వరగా దాటుతారు, ఎటువంటి లెక్క లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు మరియు వారికి ఎటువంటి శిక్ష ఉండదు.”అని అన్నాడు. ఇది విన్న ప్రవక్త[స.అ]ల వారు: “ఆ భగవంతుడు నీ శిక్షను పెంచుగాక” అని అన్నారు.
రెఫరెన్స్
దానిష్నామయే రుష్ద్,సద్ఖా.
వ్యాఖ్యానించండి