నమాజును దాని నిర్నితసమయంలో చేయడం వలన దానికి ప్రాముఖ్యతను ఇచ్చినట్లవుతుంది,అలా చేయడం విశ్వాసుల లక్షణం కూడా.
ఇమాం బాఖిర్[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: మానవుని నుండి దేని గురించైతే మొదటగా లెక్క తీసుకోబడుతుందో అది నమాజు, ఒకవేళ అది స్వీకరింపబడినట్లైతే ఇతర కార్యాలు కూడా స్వీకరింపబడతాయి. నమాజు ఒకవేళ దానిని నిర్ణిత సమయంలో పూర్తిచేసినట్లైతే అది పైకి వెళ్ళి తిరిగి తన యజమాని వద్దకు వస్తుంది, అలా వచ్చినప్పుడు దాని రూపము తెల్లగా వెలుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ విధంగా పలుకుతుంది: నువ్వు నన్ను రక్షించావు, ఆ దేవుడు నిన్ను రక్షించు గాక అని అంటుంది. ఒకవేళ దానిని నిర్ణీత సమయంలో పూర్తిచేయకుండా మరియు దాని నియమాలను పాఠించకుండా చేసినట్లైతే అది పైకి వెళ్ళి తిరిగి తన యజమాని వద్దకు తిరిగివస్తుంది అప్పుడు దాని రూపము నల్లగా కాంతిరహితంగా ఉండి [తన యజమానితో] ఈ విధంగా పలుకుతుంది: నువ్వు నన్ను పాడు చేసావు[వృధా చేసావు] ఆ భగవంతుడు కూదా నిన్ను పాడుచేయుగాక అని అంటుంది.
రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,80వ భాగము,పేజీ నం:25.
వ్యాఖ్యానించండి