ఇమాం హుసైన్[అ.స] ల వారిపై విలపించడానికి గల ప్రాముఖ్యత ఇమాం రిజా[అ.స] ల వారి దృష్టిలో
ఇమాం హుసైన్[అ.స] ల వారి బాధలను గుర్తుచేసుకుని విలపించడమనేది ఇమాముల యొక్క సున్నతు.ఇమాం హుసైన్[అ.స] ల వారి అజాదారీ[సంతాపాన్ని వ్యక్తం చేయటం] యొక్క పద్దతి కూడా మాసూముల హదీసుల ద్వారానే మనకు తెలుస్తుంది.ముఖ్యంగా ఇమాం కాజిం[అ.స] ల వారి అజాదారీ గురించి వారి కుమారులైన ఇమాం రిజ[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: మొహర్రం మాసము వచిందనగానే నా తండ్రుల వారి పెదవులపై ఎటువంటి చిరునవ్వును ఎవరూ చూసేవారు కాదు మొహర్రం యొక్క పదవరోజు గడిచేవరకు ఉదాసీనతతో ఉండేవారు.ఎప్పుడైతే పదవ రోజు వస్తుందో,ఆ రోజు వారి కొరకు తీవ్ర విచారమైన మరియు కష్టమైన రోజుగా ఉండేది. మరియు “ఏ రోజైతే నా పితామహులైన ఇమాం హుసైన్[అ.స] ల వారి వధింపబడ్డారో ఇది అదే రోజు” అని పలికేవారు. రయ్యాన్ బిన్ షబీబ్ ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు: నేను మొహర్రం యొక్క మొదటి రోజున ఇమాం రిజా[అ.స] ల వారి సన్నిధిలో ఉన్నాను ఇమాం రిజా[అ.స] ల వారు నాతో ఈ విధంగా సెలవిచ్చారు “ఓ షబీబ్ కుమారుడా!ఒక వేళ ఇమాం హుసైన్[అ.స] ల వారిపై నీవు విలపించినట్లైతే ఎప్పుడైతే నీ కండ్ల వెంబడి నీళ్ళు వస్తాయో భగవంతుడు నీవు చేసిన పాపాలలో ప్రతీ పాపాన్ని క్షమిస్తాడు.ఆ తరువాత ఈ విధంగా సెలవిచ్చారు ఒక వేళ నీవు స్వర్గంలో మా స్థాయికి సమానంగా ఉండాలనుకుంటే మా యొక్క దుఖ్ఖంలో దుఖ్ఖితునిగా మరియు మా సంతోషంలో సంతోషంగా ఉండుము”.
రెఫరెన్స్:మజాలిసె షైఖ్ సదూఖ్,మజ్లిస్ నం:27,పేజీ నం:129,130.
వ్యాఖ్యలు
Jazakallah
వ్యాఖ్యానించండి