దైవప్రవక్త[స.అ] మూడవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ హుసైన్[అ.స] దృష్టిలో నమాజ్ యొక్క ప్రాముఖ్యత..
దైవప్రవక్త[స.అ] మూడవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ హుసైన్[అ.స]ను వేల మందితో కూడి ఉన్న శత్రుసైన్యం కర్బలా యుద్ధ భూమిపై చుట్టుముట్టి వారిని చంపాలని అనుకున్నారు. ముహర్రం నెల పదవ తేదీన జొహ్ర్ నమాజ్ సమయం వచ్చినప్పుడు వారు నమాజ్ కోసమని నిలబడ్డారు, వారిపై శత్రువుల బాణాలు రాకుండా వారి సహాబీయులలో ఇద్దరు నిలబడ్డారు. వారికి చుట్టుముట్టి ఉన్న శత్రువుల భయంగాని లేదా వర్షంలా కురుస్తున్న బాణాల భయం గాని లేదు, మరణ భయంగాని లేదా గాయపడతామనే భయంగాని లేదు. వారు బాణాల మబ్బుల్లో నమాజ్ చదివారు. అస్ర్ సమయంలో శత్రువులు వారిని చంపినప్పుడు వారి సజ్దాలో ఉన్నారు. వారు సజ్దాలో తన తలను ఇచ్చి “తల పోవచ్చుగాని దాసోహం పోకూడదు” అని తెలియపరిచారు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే చహారుమ్.
వ్యాఖ్యానించండి