కర్బలా వాసులలో మొదటి షహీద్ అయిన ముస్లిం ఇబ్నె ఔసజా గురించి సంక్షిప్తంగా.
ముస్లిం ఇబ్నె ఔసజాయె అసది దైవప్రవక్త[స.అ.వ] ల వారి అనుచరులు మరియు ఇమాం హుసైన్[అ.స] ల వారితో పాటు కర్బలాలో అసువులుబాసిన అమరవీరులలో ఒకరు.వారు ఎప్పుడైతే ముస్లిం ఇబ్నె అఖీల్ కూఫా విచ్చేసారో ఆ సమయంలో బనీ అసద్ మరియు మజ్ హజ్ వంశాలకు పెద్ద దిక్కుగా వ్యవహరించి వారికి తమ సహయాన్ని అందించారు.ముస్లిం ఇబ్నె అఖీల్ మరణం తరువాత కర్బలా చేరుకుని ఇమాం హుసైన్[అ.స] ల వారి చిన్నపాటి సమూహంతో కలిసి యజీద్ సైన్యంతో పోరాడి తన ప్రాణాలను అర్పించారు. కొన్ని హదీసుల అనుసారంగా వారి భార్య మరియు కుమారుడు ఖలఫ్ బిన్ ఔసజా కూడా కర్బలా లో ఉన్నారు.వారి కుమారుడు కూడా తండ్రి వలె ఇమాం హుసైన్[అ.స] ల వారి తరపున పోరాడి ప్రాణత్యాగం చేశాడు. ఆషూరా రోజున ఇమాం హుసైన్[అ.స] ల వారి అనుచరులలో ప్రాణత్యాగం చేసిన వారిలో మొదటి వ్యక్తి కూడా వీరే.ఆషూరా రోజున ఉమర్ ఇబ్నె సాద్ సైన్యాంలో సైన్యాధిపతి అయిన ఉమర్ ఇబ్నె హజ్జాజ్ ఆజ్ఞానుసారుం జినాహ్ మొట్టమొదటిసారిగా ఇమాం హుసైన్[అ.స] ల వారి అనుచరుల సమూహం పై దాడి చేసాడు.ఈ దాడిలో ముస్లిం ఇబ్నె ఔసజా శత్రువులతో పోరాడి తన ప్రాణాలను వదిలారు.ప్రాణం పోతుందనగా ఇమాం హుసైన్[అ.స] మరియు హబీబ్ ఇబ్నె మజాహిర్ ఇద్దరు వారి వద్దకు చేరుకున్నారు.ముస్లిం ను ఈ పరిస్థితిలో చూసిన ఇమాం హుసైన్[అ.స] ల వారు “నీ చావును జీర్ణించుకోవటం నాకు కష్టమే కానీ నేను నీకు స్వర్గపు సువార్తను ప్రకటిస్తున్నాను” అని అన్నారు.ఆ తరువాత హబీబ్ తనతో ముస్లిం ఏదో చెప్పదలచుకున్నారని తెలుసుకుని వారి దగ్గరకు వెళ్ళగా “నేను నీకు తాకీదు చేస్తున్నాను నీపై అల్లాహ్ కరుణ కలుగు గాక, ఎప్పటి వరకు నీ కంఠంలో ప్రాణం ఉంటుందో అప్పటి వరకు వీరి కొరకు పోరాడుతూ ఉండు, వారికి సహాయం చేయటంలో వెనుకాడవద్దు చివరకు ప్రాణాలు పోయినా సరే” అని అన్నారు. ఈ విధంగా ముస్లిం ఇబ్నె ఔసజా కర్బలా అమరవీరులతో పాటు శాస్వతంగా విశ్వాసుల హృదయాలలో నిలిచిపోయారు.
రెఫరెన్స్: అల్ ఇర్షాద్,షైఖ్ ముఫీద్,పేజీ నం:249,లుహూఫ్,సయ్యద్ ఇబ్నె తావూస్,పేజీ నం:133.
వ్యాఖ్యానించండి