హుదైబియహ్ సంధి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది మరియు ఎవరెవరి మధ్య జరిగింది అన్న అంశాల వివరణ సంక్షిప్తంగా...
ఈ సంఘటన సారాంశం: హిజ్రీ శకం 6వ సం॥లో దైవప్రవక్త[స.అ] తమ 14 వందల సహాబీయులతో ఉమ్రా ఉద్దేశంతో మదీనా నుండి బయలుదేరారు. అందరికి తమ ఖడ్గాలను వాటి ఒరలోనే ఉంచమని ఆదేశించారు. కేవలం ఉమ్రా చేసుకునేందుకు మాత్రమే వచ్చాము ఎట్టిపరిస్థితిలో యుధ్ధం చేసే ఉద్దేశమే లేదు అని ఖురైషియులకు అర్ధమైయ్యే విధంగా “జుల్ హలీపహ్”(మక్కా పట్టణానికి అతి దగ్గర ప్రదేశం) లో అందరు ఎహ్రామ్(హజ్జ్ చేసే సమయంలో ధరించే ప్రత్యేక దుస్తులు) ధరించి మరియు తఖ్లీద్(అల్లాహ్ మొక్కుబడికి సూచనగా మొడలలో వేసే పట్టెడలు) తో బలిచ్చే జంతువులను తీసుకొని బయలుదేరారు అయినప్పటికీ ఖురైషియులకు ముహమ్మద్[స.అ] తమ శక్తి సామర్ధ్యాలతో మక్కాలో ఖురైషియుల ఆడంబరాన్ని, ప్రతిష్టను మరియు దర్జాను మట్టి కరిపించారని అరేబీయులు ఎక్కడ అనుకుంటారో అని భయం పుట్టుకొచ్చింది. అందుకు “సుహైల్ బిన్ అమ్ర్ బిన్ అబ్దెవద్ అల్ ఆములి” ఆథిపత్యంలో ముహమ్మద్[స.అ] వద్దకు ఒక రాయబార సంఘాన్ని దైవప్రవక్త[స.అ]తో “ఈ సంవత్సరం తిరిగి వెళ్ళిపోమని, వచ్చే సంవత్సరం మూడు రోజులు మనశ్శాంతిగా ఉమ్రా చేసుకునేందుకు మక్కాను ఖాళీ చేస్తాము” అని కోరమని పంపారు.
దాంతో పాటు కొన్ని కఠిన షరత్తులు కూడా పెట్టారు. అయినా దైవప్రవక్త[స.అ] ఇస్లాం శుభహేతువు కోరి వాటిని అంగీకరించారు. వారి మధ్య జరిగిన సంధినే హుదైబియహ్ సంధి అంటారు.[సహీ బఖారీ, భాగం 8, పేజ్ 122.]
రిఫ్రెన్స్
సహీ బుఖరీ, బుఖారీ, కితాబుష్షురూతొ ఫిల్ జిహాద్, భాగం 8, పేజ్ 122.
వ్యాఖ్యానించండి