హదైబియహ్ సంధి విషయంలో సహాబీయులలో కొందరు దైవప్రవక్త[స.అ] పట్ల నిరాశ చెందారు అని చరిత్ర వివరిస్తుంది...
దైవప్రవక్త[స.అ], సంధి పనులను ముగించిన తరువాత తమ సహాబీయులను ఇలా ఆదేశించారు: “మీరందరు వెళ్ళి బలివ్వండి మరియు తల వెంట్రుకలను తీయించుకోండి”. (చరిత్ర కారుడు ఇలా ప్రవచించెను): అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను వాళ్ళలో ఏ ఒక్కరూ కదలలేదు అప్పటికే దైవప్రవక్త(స.అ) మూడు సార్లు ఆదేశించారు. ఎప్పుడైతే ఎవ్వరు కూడా వారి మాట వినలేదో దైవప్రవక్త[స.అ] లేచి తమ డేరాలోకి వెళ్ళిపోయారు. ఆ తరువాత బయటకు వచ్చి ఎవరితో మాట్లాడకుండా తమ తరపు నుండి ఒంటెను బలిచ్చి క్షౌరకుడిని పిలిచి తల వెంట్రుకలు తీయించేశారు. అది చూసి సహాబియులు కూడా వచ్చి బలిచ్చి ఒకరి తల వెంట్రుకలను మరొకరు తీయించుకోవడం మొదలు పెట్టారు. అక్కడ పరిస్థితి ఒకరిని ఒకరు చంపుకుంటారేమోనట్లుగా అయ్యింది.[సహీ బుఖారీ, భాగం 8, పేజ్ 122]
రిఫ్రెన్స్
సహీ బుఖారీ, బుఖారీ, కితాబుష్షురూతొ ఫిల్ జిహాద్ అధ్యాయం, భాగం 8, పేజ్ 122. ముస్లిం తన “సహీ” అను పుస్తకంలో “బాబొ సుల్హె హుదైబియహ్” లో లిఖించారు.
వ్యాఖ్యానించండి