దైవప్రవక్త[స.అ] చివరికి వారు వ్రాయాలనుకున్న లేఖనాన్ని వ్రాశారా లేదా అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
దైవప్రవక్త[స.అ]కు కలం కాగితాన్ని ఇవ్వకూడదు అన్న పన్నాగంలో ఎక్కువ మంది ఉమర్ వైపు ఉన్నారు, అందుకే దైవప్రవక్త[స.అ] ఇక లేఖనం వ్రాసినా లాభం లేదనుకున్నారు. దైవప్రవక్త[స.అ]కు “వీళ్ళు నా లేఖనాన్ని గాని నా మాటను గాని గౌరవించరు” అని తెలుసింది, ఎందుకంటే వీళ్ళు కంఠస్వరం పట్ల అల్లాహ్ ఆదేశాన్నే అచరించని వారు నా ఆదేశాలను ఎక్కడ ఆచరించాలీ, అని.
వివేక పరంగా కూడా దైవప్రవక్త[స.అ] ఇక వాళ్ళ కోసం ఎటువంటి లేఖనం వ్రాయకపోవడమే సరైనది ఎందుకంటే దైవప్రవక్త[స.అ] జీవితంలోనే దాని గురించి పోట్లాడుకుంటున్నారంటే ఇక మరణించిన తరువాత దాని పై ఏమి అమలు చేస్తారు!. అభ్యంతరం చేసేవారు ఇది హిజ్యాన్(ఉన్మాదికి)కు గురై చెప్పిన మాటలు, ఉన్మాదిగా వ్రాసేశారు, దీనికి ప్రాధాన్యత ఎందుకు అనీ అంటారు; బహుశ చివరి క్షణాలలో దైవప్రవక్త[స.అ] ఉపదేశాలన్నీంటిలో కూడా అనుమానిస్తారేమో అని లేఖనం వ్రాయడం మంచిది కాదు అని వ్రాసి ఉండరు...
వ్యాఖ్యానించండి