దైవప్రవక్త[స.అ] మరణానంతరం, అబూసుఫ్యాన్ కపట ప్రవర్తనా మరియు కపట మాటలు...
దైవప్రవక్త[స.అ] మరణానంతరం, అదే రోజు ఇంకా ఆ పవిత్ర మృతదేహానికి అంత్యక్రయలు జరగక ముందే ముస్లిములలో కొందరు ఒక ప్రతేక ప్రదేశంలో సమావేసమై ఒక వ్యక్తిని ఖలీఫాగా ఎన్నుకొని బైఅత్ చేశారు, ఆ వ్యక్తి ఖురైష్ వంశానికి చెందిన వారు కారు, అందుకని ఖురైష్ వంశానికి చెందిన బనీ హాషిమ్ మరియు బనీ ఉమయ్యహ్ లతో సహా వివిధ సంఘాలు దాన్ని సహించ లేక పోయారు. ఇస్లాం మరియు ముస్లిముల పట్ల గుండే నిండా ద్వేషాన్ని నింపుకొని ఉన్న అబూ సుఫ్యాన్ ఇదే మంచి సమయం అని భావించి దైవప్రవక్త[స.అ] పినతండ్రి అయిన అబ్బాస్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు.. ఇంకా కూర్చోనే ఉన్నావేంటి, అబ్దె మనాఫ్ కుమారులను వెనక్కి నెట్టేశారు, దైవప్రవక్త[స.అ] ద్వార ఖిలాఫత్ పదవి కోసం నియమించబడ్డ అలీ[అ.స]ను వెనక్కి నెట్టేసి “బనీ తమీమ్”కు చెందిన ఒక వ్యక్తి దైవప్రవక్త[స.అ] ఉత్తరాధికారి అయి కూర్చున్నాడు, అయ్యో! ఎంత కష్టం వచ్చి పడింది”. (ఆ తరువాత) అబూసుఫ్యాన్ గట్టిగా ఇలా అరిచారు: “అబ్దె మనాఫ్ కుమారులారా! మీరు మీ హక్కులు (వెనక్కి) తీసుకోండి, “నెత్తురు మాత్రమే చల్లార్చే తుఫానును చూస్తున్నాను”(ఇక ఈ సమయంలో రక్తం చిందించాల్సిందే అని అబూసుఫ్యాన్ ఉద్ధేశం).[దర్ పర్తూయే ఆజరఖ్ష్, పేజీ16]
రిఫ్రెన్స్
మిస్బాహ్ యజ్దీ, దర్ పర్తూయే ఆజరఖ్ష్, ఖుమ్, మొఅస్ససయే ఆమూజిష్ వ ఫజోహిషె ఇమామ్ ఖుమైనీ(ర.అ),1381.
వ్యాఖ్యానించండి