.ఇమామ్ జాఫరె సాధిఖ్[అ.స] సమాధి పై ఉన్న కట్టడాన్ని(హరం ను) కొన్ని దశాబ్దాల ముందు నీఛమైన అధికారులు కూల్చేశారు.
దైవప్రవక్త[స.అ] యొక్క 6వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ జాఫరె సాధిఖ్[అ.స] రబీవుల్ అవ్వల్ నెల 17వ తారీఖు, శుక్రవారం రోజు హిజ్రీ 83వ ఏట జన్మించారు. వీరి తండ్రి పవిత్ర ఇమాముల నుండి ఐదవ ఇమామ్ హజ్రత్ ముహమ్మద్[అ.స] అని చెప్పడమే వీరి వంశం ప్రతిష్టత గురించి చాలు. తల్లి పేరు ఫాతెమా బింతె ఖాసిమ్ ఇబ్నె అబీబక్ర్ (ఉమ్మె ఫర్వా అని పిలవబడేవారు) ఆమె మదీనహ్ స్ర్తీల మధ్య చాలా ప్రతిష్ఠత కలిగి ఉండేవారు. ఆమె స్త్రీలకు ఇస్లాం ధర్మం పట్ల కలిగే సందేహాలను దూరం చేసేవారు.
ఇమామ్ జాఫరె సాధిఖ్[అ.స] చాలా బిరుదులు కలిగి ఉన్నారు: సాబిర్, ఫాజిల్, తాహిర్, ఖాయిమ్, కామిల్. వారి ప్రముఖ బిరుదు "సాదిఖ్" మరియు కున్నియత్ "అబూఅబ్దిల్లాహ్". వారు 65 సంవత్సరాల వయసులో హి.శ 148వ సంవత్సరంలో అప్పటి అబ్బాసీ ఖలీఫా ద్వార చంపబడ్డారు. వారి సమాధి జన్నతుల్ బఖీలో వారి పితమహుల ప్రక్కన ఉంది. వారి సమాధి పై ఉన్న కట్టడాన్ని(హరం ను) కొన్ని దశాబ్దాల ముందు నీఛమైన అధికారులు కూల్చి వేశారు. అల్లాహ్ ఆ దర్మార్గులను నాశనం చేయుగాక.[సీమాయే పీష్వాయాన్, పేజీ96].
రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.
వ్యాఖ్యానించండి