సహాబీయులు అవిశ్వాసం వైపు మరలిపోతారు అన్న విషయాన్ని వివరిస్తున్న ఖుర్ఆన్ ఆయత్...
అవిశ్వాసం వైపు మరలిపోయిన ప్రస్తావన వున్న ఆయత్ ఖుర్ఆన్ యొక్క ఆలె ఇమ్రాన్ సూరహ్ యొక్క 144వ ఆయత్. అల్లాహ్ ఇలా ప్రవచించెను: “ముహమ్మద్[స.అ], ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్యచెయ్యబడితే మీరు వెనుకంజవేసి మరలిపోతారా? జ్ఞాపకం ఉంచుకోండి, మరలిపోయే వాడు అల్లాహ్కు ఏమాత్రం నష్టం కలిగించలేడు. కాని అల్లాహ్ కృతజ్ఞత చూపే దాసులుగా జీవించే వారిని ఆయన తగువిధంగా బహూకరిస్తాడు”[ఆలె ఇమ్రాన్:144]
ఈ ఆయత్లో చాలా స్పష్టంగా మరియు వివరంగా తొందరలోనే సహాబీయులలో కొందరు తమ పూర్వ మతము వైపుకు వెనుకంజ వేసి మరలిపోతారు మరియు కేవలం కొద్ది మంది సహాబీయులే రుజుమార్గంపై నిలకడగా మిగిలి ఉంటారు, వాళ్ళను “షాకెరీన్” అను పదంతో గుర్తుచేయబడింది. ఖుర్ఆన్ దృష్టిలో షాకెరీన్ల సంఖ్య చాలా తక్కువ. ఖుర్ఆన్ ఉపదేశం: “నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు తక్కువే”[సబా:13]
దైవప్రవక్త[స.అ] హదీసులలో కూడా ఈ మార్పు గురించి సూచించబడినది.
వ్యాఖ్యానించండి