సహాబీయులకు అత్యాశ ఉండేది అన్న అంశం పై దైవప్రవక్త[స.అ] హదీస్ వివరణ...
దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “నేను మీ కన్న ముందు వెళ్ళిపోతాను. నేను మీపై సాక్షిని. అల్లాహ్ సాక్షిగా నేను కౌసర్ కొలనును చూస్తున్నాను. నాకు భూమిపై ఉన్న ధనాగారాలన్నీటి తాళాలు ఇవ్వబడినవి. అల్లాహ్ సాక్షిగా నాకు మీరు అవిశ్వాసులుగా మారిపోతారనే భయం లేదు కాని ప్రపంచాన్ని పొందేందుకు అత్యాశ మరియు మోహము యొక్క భయం ఉంది”.[సహీ బుఖారీ, 100-101]
దైవప్రవక్త[స.అ] సత్యమే పలికారు. సహాబీయులలో అత్యాశ పుట్టుకొచ్చింది. ఆ మార్గంలో ఎన్ని విభేధాలు వచ్చాయంటే కత్తులు చేతపట్టి యుధ్ధాలకు సిధ్దమైయ్యారు. ఒకరిని ఒకరు అవిశ్వాసుల నిందలు మోపడం మొదలు పెట్టారు. సహాబీయులలో కొందరి వద్ద వెండీబంగారాల ధనాగారాలు ఉండేవి. మస్వూద్ తన పుస్తకం “మురవ్విజుజ్ జహబ్”లో మరియు తబరీ మొదలగు వారు తమ తమ పుస్తకాలలో వ్రాసినట్లు; కేవలం ఒక్క జుబైర్ యొక్క సంపద 50 వేల దీనారుల నగదు, వెయ్యి గుర్రాలు, వెయ్యి పనివాళ్ళు మరియు బస్రా, కూఫా పట్టణాలలో చెప్పలేనంత ఆస్తి, ఈజిప్ట్లో లెక్కలేనివన్ని భూములు ఉండేవి. అలాగే వేరే సహాబీయులు కూడా.
రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, పేజీ100-101.
వ్యాఖ్యానించండి