సహాబీయులు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసేందుకు బద్దకించేవారని నిదర్శిస్తున్న ఆయత్...
అనువాదం: “విశ్వసించిన ప్రజలారా! మీకు ఏమైనది, మీతో అల్లాహ్ మార్గంలో బయలుదేరండి అని చెప్పినప్పుడు, మీరు నేలకు అతుక్కుపోయారు, మీరు పరలోకానికి మారుగా ప్రాపంచిక జీవితాన్ని కోరుకున్నారా? అలా అయితే మీరు తెలుసుకోవాలి, ప్రాపంచిక జీవితపు సకలసామాగ్రి పరలోక సుఖాలముందు స్వల్పాతి స్వల్పమైనదిగా తేలుతుందని. మీరు గనక లేపకపోతే, దేవుడు మీకు వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు. ఇంకా మీ స్థానంలో మరొక సంఘాన్ని దేనినయినా లేపుతాడు. మీరు దేవునికి ఏమాత్రం నష్టం కల్పించలేరు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలిగివున్నాడు”[తౌబహ్:38,39]
ఈ ఆయత్లో సహాబీయులు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసేందుకు బద్దకించేవారని, ప్రాపంచిక జీవిత సంతోషాలు చాలా తక్కువని తెలిసినప్పటికీ దాని వైపే మక్కువ చూపించారు, అని స్పష్టంగా తెలుస్తుంది. చివరికి అల్లాహ్ వాళ్ళకు వ్యధాభరితమైన శిక్షతో బెదిరించి ఆయన తనకు వాళ్ళ స్దానంలో నిజమైన విశ్వాసులను బదులుగా తీసుకొచ్చే శక్తి ఉందని ప్రకటించాడు. మరలాంటప్పుడు సహాబీయులందరూ మంచివారే అని భావించటం ఎంతవరకు సమంజసం!!!
వ్యాఖ్యానించండి