సహాబీయులు కూడా విశ్వాస పరంగా బలహీనత కలిగి ఉండేవారు అని నిదర్శిస్తున్న ఆయత్ వివరణ...
“విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో చలించే సమయం, ఆయన అవతరింపజేసిన సత్యం ముందు లొంగిపోయే సమయం ఇంకా రాలేదా? పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా వారు మారిపోకూడదు. ఒక సుదీర్ఘకాలం వారిపై గడచిపోయింది. అప్పుడు వారి హృదయాలు కఠినమయ్యాయి. వారిలో అనేకులు పరమ దుర్మార్గులు”[హదీద్:16]
జలాలుద్దీన్ సివ్తీ, దుర్రె మన్సూర్లో ఇలా వ్రాసారు: “దైవప్రవక్త[స.అ] యొక్క సహాబీయులు మదీనాకు వచ్చి మక్కాలో పడ్డ కష్టాల తరువాత మదీనాలో సుఖశాంతులు పొందడంతో చాలా విషయాలలో బద్దకించడం మొదలు పెట్టారు అందుకే ఈ ఆయత్ అవతరింపబడింది”
వేరే రివాయత్లో ఖుర్ఆన్ అవతరించబడిన 17 సం॥ల తరువాత కూడా దైవప్రవక్త[స.అ]కు ముహాజిరీన్ మనసులో బలహీనతా, బద్దకం కనిపించడంతో ఈ ఆయత్(أَ لَمْ يَأْنِ لِلَّذينَ آمَنُوا) అవతరించబడింది, అని ఉంది.
అనగా సహాబీయులలో కూడా మంచివారు మరియు చెడ్డవారు ఉండేవారు అని గ్రహించవలసిన అవసరం ఉంది.
వ్యాఖ్యానించండి