సహాబీయులు దీన్ ఆదేశాలను మార్చారు అన్న విషయం పై కొన్ని నిదర్శనలు...
సహాబీయులు దైవప్రవక్త[స.అ] మరణానంతరం అవిశ్వాసులుగా మరలిపోతారు అన్న విషయాన్ని వివరించిది. వాటిపై హదీస్ నిదర్శనం; (హదీసుల సారంశం) దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “నేను ప్రళయదినం నాడు నిలబడి ఉండగా నాకు తెలిసిన ఒక సమూహాన్ని చూసి వాళ్ళను గుర్తుపడతాను ఇంతలో ఒకడు వచ్చి నన్ను పిలుస్తాడు ఆ తరువాత వాళ్ళను నరకం వైపు తీసుకొని వెళ్తుండగా, “వీళ్ళు చేసిన పాపమేమిటి?” అని ప్రశ్నించగా మీ తరువాత వీళ్ళు ముర్తద్ గా మారిపోయారు అని జవాబివ్వడం జరుగుతుంది. ఆ తరువాత చాలా తక్కువ మంది విముక్తి పొందుతారు”.[సహీ బుఖారీ, భాగం4, పేజీ94-99, 156]
మరో చోట ఇలా ప్రవచించబడి ఉంది: “నేను కౌసర్ సేలయేరుపై మీ కన్న ముందు చేరి ఉంటాను.... నా ముందు కొన్ని సమూహాలు వెలుస్తాయి వారిని నేను గుర్తుపడతాను వారు కూడా నన్ను గుర్తుపడతారు ఆ తరువాత వాళ్ళ మరియు నా మధ్య ఒక తెర వేయబడుతుంది. వీళ్ళు నా సహాబీయులు, అని అరుస్తాను అందుకు మీ తరువాత వీళ్ళు చేసిన పనులు మీకు తెలియవు అని జవాబివ్వబడుతుంది. అప్పడు నేను, నా తరువాత నా మతంలో మార్పులు చేసిన వారిని అల్లాహ్ శిక్షించాలి, అని అంటాను”.[సహీ ముస్లిం భాగం7, పేజీ66, హదీసుల్ హౌజ్]
సహ్హాహ్ మరియు మసానీద్ గ్రంథాలలో ప్రవచించబడిన ఈ హదీసులను చూసిన తరువాత సహాబీయులు దీన్లో మార్పులు చేశారని, అంతేకాకుండా అవిశ్వాసం వైపు మరలిపోయారని నమ్ముతారు. ఈ హదీసులను సహాబీయుల మూడో రకం అనగా మునాఫిఖులను ఉద్దేశించబడినవని అనడం, సరైనది కాదు. ఎందుకంటే హదీసులో దైవప్రవక్త[స.అ] వీళ్ళు నా సహాబీయులు అని అంటారు మరి ప్రళయంనాడు మునాఫిఖులను అలా అని పిలిచే ప్రశక్తే లేదు.
రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం4, పేజీ94-99, 156. భాగం3, పేజీ 32. సహీ ముస్లిం భాగం7, పేజీ66, హదీసుల్ హౌజ్.
వ్యాఖ్యానించండి