నమాజ్ మార్చిన వారి వివరణ పై “బుఖారీ” మరియు “ముస్లిం” గ్రంథాల రివాయతులు...
“బుఖారీ” మరియు “ముస్లిం” గ్రంథాల రివాయతులు; “దైవప్రవక్త[స.అ] మినా(మక్కా పట్టణంలో కాబా వద్ద ఒక ప్రదేశం)లో నమాజును ఖస్ర్(ప్రయాణంలో నాలుగు రక్అతుల నమాజులను రెండు రక్అతుల వరకు చదవడం) చేసి చదివారు మరి అలాగే అబూబక్ర్, ఉమర్ మరియు తన ఖిలాఫత్లో కొంతకాలం ఉస్మాన్ కూడా అలాగే చేశారు. ఆ తరువాత దానిని నాలుగు రకాతులుగా మార్చేశారు”.[సహీ బుఖారీ, భాగం2, పేజీ154]
“ముస్లిమ్” తన గ్రంథం “సహీ”లో “జోహ్రీ” కథనాన్ని లిఖించారు: “ప్రయాణంలో కూడా ఆయేషా ఎందుకని నాలుగు రక్అతుల నమాజు చదువుతుంది? అని నేను “ఉర్వా”ను ప్రశ్నించగా ఆమె కూడా ఉస్మాన్ వలే సాకును వ్యక్తం చేశారు అని జవాబిచ్చారు”.[సహీ ముస్లిం, భాగం2, పేజీ 143, కితాబొ సలాతుల్ ముసాఫిరీన్].
రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం2, పేజీ154/ సహీ ముస్లిం, భాగం2, పేజీ 143, కితాబొ సలాతుల్ ముసాఫిరీన్.
వ్యాఖ్యానించండి