దైవప్రవక్త[స.అ] సున్నత్ ను మరియు ఖుర్ఆన్ స్పష్టమైన ఆదేశాలను మార్చిన ఉమర్ ఇబ్నె ఖత్తాబ్...
“ఉమర్ ఇబ్నె ఖత్తాబ్” కూడా చాలా విస్పష్ట ఆదేశాలకు వ్యతిరేకంగా తమ సొంత కల్పన మరియు వ్యాఖ్యాలతో, తమ ఆలోచనలతో ఫత్వా లిచ్చేవారు. ఉదాహారణకు: ఉమర్ ప్రకటన ప్రకారం “దైవప్రవక్త[స.అ] కాలంలో రెండు ‘ముతా’లు ఉండేవీ, నేను ఆ రెండింటిని నిషేదిస్తున్నాను వాటిపై అమలు చేసిన వారికి శిక్షిస్తాను”. ఖుర్ఆన్లో స్పష్టంగా తయమ్ముమ్ ఆదేశం (فَلَمْ تَجِدُوا ماءً فَتَيَمَّمُوا صَعيداً طَيِّبا అనువాదం: మీకు నీరు లభ్యంకాని పక్షంలో, పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి.[నిసా:43]) వున్నప్పటికీ అతను జనాబత్లో వున్నప్పుడు నీళ్ళు దొరక్కపోతే నమాజ్ను వదిలేయమని ఆదేశమిచ్చేశారు. మరి ఈ సంఘటనను “బుఖారీ”, “బాబొ ఇజా ఖాఫల్ జునుబ్ అలా నఫ్సెహ్”లో ఇలా ప్రవచించారు: “నేను షఖీఖ్ బిన్ సల్మహ్ను ఇలా చెబుతుండగా విన్నాను: “నేను, అబ్దుల్లాహ్ మరియు అబూ మూసా వద్ద ఉండగా అబూ మూసా ఒకవేళ అపవిత్రునికి నీళ్ళు దొరక్కపోతే అతను ఏమిచేయాలి అనే విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అబూఅబ్దుల్లాహ్? అని ప్రశ్నించగా నీళ్ళు దొరకనంత వరకు అతడు నమాజ్ చదవడు” అని జవాబిచ్చాడు. అందుకు అబూ మూసా “అయితే దైవప్రవక్త[స.అ] అమ్మార్కు ఇచ్చిన ఉపదేశాన్ని ఏమిచేయాలి?” అని అడిగారు. “కాని ఉమర్ ఆ మాటతో తృప్తి పొందలేదు కదా” అన్నాడు. “అమ్మార్ విషయాన్ని వదిలేద్దాం మరి తయమ్ముమ్ ఆదేశం ఉన్న ఆయత్ గురించి ఏమంటావు?” అని అబూమూసా ప్రశ్నించాడు ఆ పై అబ్దుల్లాహ్ మౌనంగా వుండిపోయి ఏ జవాబు తోచకపోవడంతో “ఒకవేళ అలాగని చెబితే ఎవరికైన సరే నీళ్ళు చల్లగా ఉన్నాయని అనిపిస్తే స్నానాన్ని వదిలి తయమ్ముమ్ చేసుకుంటాడు” అని అన్నారు. నేను “అబ్దుల్లాహ్ అందుకే మక్రూహ్ గా నిశ్చయించి వుంటారు” అని సఖీఖ్తో అన్నాను. అతను “నిస్సందేహంగా” అని అన్నాడు.[బుఖారీ, భాగం1, పేజీ54]
రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, భాగం1, పేజీ54.
వ్యాఖ్యానించండి