మృత్యువును విస్మరించటం

గురు, 11/07/2019 - 16:02

మృత్యువు గురించి ఇమాం అలి[అ.స] ల వారి హదీసు యొక్క వివరణ.

మృత్యువును విస్మరించటం

ఇమాం అలి[అ.స]: “ఎవరైతే తమ ముందు చనిపోతున్నవారిని చూసిన తరువాత కూడా మృత్యువును విస్మరిస్తున్నారో వారు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు”.

మన కుటుంబాలలో, స్నేహితులు మరియు దగ్గరి బంధువులలో ఎవరో ఒకరు చనిపోవటం మరియు మనము వారి జనాజాలొ వెళ్ళటం అలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ దాని నుండి మనము ఎటువంటి గుణపాఠాన్ని తీసుకోము.మనకు మృత్యువు రాదు అనే ఆలోచనలోనే ఉంటామో ఏమో! మృత్యువనేది ఒక యదార్ధం అది అందరికి రావలసిందే అది ఆలస్యంగా అయినా తొందరగా అయినా.దగ్గరి బంధువులలో ఎవరైతే చనిపోతారో కొన్ని రోజులు వారి గురించి బాధ పడినా ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా మరచిపోతాము.ఒక వేళ మరచిపోకుండా ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రయోజనమేమిటంటే మృత్యువు పట్ల కొంత భయము,మన కార్యాల పట్ల కొంత దృష్టిని సారించటం,చేసిన పాపాల పట్ల పస్చాత్తాపం,ప్రళదినం కొరకు తనను తాను సిధ్ధపరచటం,ప్రాపంచిక జీవితంతో ప్రేమను తగ్గించుకోవటం అనే ప్రయోజనాలు కలుగుతాయి.

రెఫరెన్స్: నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:121.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5