బర్రా బిన్ ఆజిబ్ అంగీకారణ తరువాత కూడా సహాబీయులందరినీ న్యాయముర్తులని ఎలా నమ్మగలం...
“అలా బిన్ ముసయ్యబ్” తన తండ్రిగారి వచనమును ఇలా లిఖించారు: “నేను బర్రా బిన్ ఆజిబ్తో కలిసి “మీరు చాలా అదృష్టవంతులు మీకు దైవప్రవక్త[స.అ]తో కలిసి ఉండే భాగ్యం కలిగింది, మీరు బైఅతే షజరా(చెట్టుక్రింద చేసిన బైఅత్)లో పాల్గొన్నారు” అని అన్నాను. అందుకు అతను “సోదరా! ఆ తరువాత మేము ఏమిచేసామో నీకు తెలియదు” అని అన్నాడు”.[బుఖారీ, భాగం 3, పేజీ 32]
అగ్ర సహాబీయులలో లెక్కించబడ్డ, చెట్టు కింద దైవప్రవక్త[స.అ] చేతులపై బైఅత్ కూడా చేసిన మరియు అల్లాహ్ వాళ్ళతో రాజీ పడినటువంటి ప్రశంసలు అందుకన్న “బర్రా” లాంటి సహాబీ తమకు వ్యతిరేకంగా “మేము దైవప్రవక్త[స.అ] తరువాత బిద్అత్లను సృష్టించాము” అని సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఇక వేరే వాళ్ళ పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. అతని ఈ సాక్ష్యం దైవప్రవక్త[స.అ] తమ తరువాత బిద్అతుల గురించి సూచించిన విషయాలకు మరియు అవిశ్వాసం పై మరలిపోతారనే వార్తలకు నిదర్శనం. ఇవన్ని చూశాక కూడా ఒక బుధ్ధిమంతుడు, సహాబీయులందరిని న్యాయముర్తులే అని నమ్మే సమస్యే లేదు.
రిఫ్రెన్స్
బుఖారీ, సహీబుఖారీ, భాగం 3, పేజీ 32, బాబొ గజ్వా హుదైబియహ్.
వ్యాఖ్యానించండి