ముస్లిములు ఎన్ని వర్గాలుగా విభజింపబడి ఉన్నా ఇస్లాము పేరున మరియు దైవప్రవక్త[స.అ.వ] ల వారి పేరు మీద ఏకమై తమ సమస్యలకు పరిష్కారాన్ని వెదికే రోజున ఈ భూమి మీద ఏ ముస్లిము అన్యాయానికి గురికాడు అని చెప్పవచ్చు.
దివ్యఖురానులో చాలా చోట్ల ఐక్యతతో ఉండమని ఆదేశించటం జరిగింది.సూరయే ఆలె ఇమరాన్ యొక్క 103 ఆయతులో అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు: “అల్లాహ్ త్రాడును అందరు కలిసి గట్టిగా పట్టుకొండి,చీలిపోకండి”.[ఆలె ఇమ్రాన్/103].ఐక్యతతో ఉండటమంటే తమ మతవిశ్వాసాలను వదిలి ఇతరుల మతవిశ్వాసాలను స్వీకరించటం కాదు.తమ విశ్వాసాలను మార్చుకోకుండా వేరేవైపువారి విశ్వాసాలను గౌరవిస్తూ వారితో ఐక్యతతో మరియు సోదరభావంతో మెలగడం. ముస్లిములు ఎన్ని వర్గాలలో మరియు ఫిర్ఖాలలో విభజింపబడి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నా వారు విశ్వసించేది ఒక అల్లాహ్ పైనే మరియు వారి దైవగ్రంధం కూడా ఒక్కటే మరియు వారి ప్రవక్త కూడా ఒక్కడే,ఈ విషయాన్ని గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ నాడు ఒక వైపు అమెరికా,ఇజ్రాఈల్ లాంటి దుష్టశక్తులు ముస్లిములను విడదీయటానికి కృషిచేస్తుండగా వేరేవైపు అరేబియా,ఖతర్,యు.యె.ఈ వంటి ముస్లిము దేశాలు వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి.ఇలాంటి సమయంలో ముస్లిములు అంతర్దృష్టితో వ్యవహరించి ఐక్యతతో ఏదో ఒక కార్యాచరణకు పూనుకోవలసిన అవసరం ఉంది. ఈ నాడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు అన్ని వర్గాల వారి ఐక్యతకు కేంద్రబింధువు. వారి జన్మదినాన్ని సున్ని ముస్లిములు రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీకున జరుపుకుంటే షీయా ముస్లిములు 17 న జరుపుకుంటారు.ఇస్లామీయ విప్లవ నాయకులైన ఆయతుల్లాహ్ ఖుమైని ల వారి పిలుపు మెరకు దైవప్రవక్త[స.అ.వ] ల వారి జన్మదిన వేడుకలను ఈ వారంలో ఇరు వర్గాల వారు కలిసికట్టుగా జరుపుకొని తమ ఐక్యమత్యాన్ని చాటుకుంటారు.
వ్యాఖ్యానించండి