.ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] కాలంలో వివిధ ఆలోచనల మరియు అభిప్రాయాల వల్ల ఏర్పడిన వర్గాల గురించి సంక్షిప్తం వివరణ.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] కాలంలో విశ్వాసపరంగా వివిధ ఆలోచనలు మరియు వర్గాలు కూడా స్థాపించబడ్డాయి. అహ్లెకితాబ్(క్రైస్తవులు, యూదులు)ల విశ్వాలు మరియు యూనాన్ విద్వాంసుల నమ్మకాలు ముస్లిముల ముందు రావడంతో, వారిలో వివిధ సంకోచాలు మరియు సందేహాలు పుట్టుకొచ్చాయి.
ఆ కాలంలోనే ఈ వర్గాలు వెలుగులోకి వచ్చాయి; “మోతజిలహ్”, “జబ్రియహ్”, “ముర్జిఅహ్”, “గులాత్”, “జనాదెఖహ్”, “ముషబ్బహ”, “ముతసవ్విఫహ్”, “ముజస్సమహ్”, “తనాసుఖియ్యాహ్” మొదలగు వర్గాలు స్థాపించబడ్డాయి. ప్రతీ వర్గం వారివారి విశ్వాసాలను మరియు నమ్మకాలను ప్రచారించుకునేవారు.
అంతేకాకుండా ప్రతీ ఇస్లామీయ విద్యలో, విద్వాంసుల మధ్య అభిప్రాయబేధాలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు “ఖుర్ఆన్ పఠించే విధానం”లో, “ఖుర్ఆన్ వ్యాఖ్యానం”లో, “హదీస్”లో, “ఫిఖా”లో వాదోపవాదాల వేడి చుట్టుముట్టింది. ప్రతీ ఒక్కరు తమ నమ్మకాల పట్ల తమ అభిప్రాయాలను తమకు తెలిసిన విధంగా వివరించేవారు.[సీమాయే పీష్వాయాన్, పేజీ100]
రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.
వ్యాఖ్యానించండి