నిసాయి “ఖసాయసే అమీరుల్ మొమినీన్” అను పుస్తకం వ్రాస్తే అతను షియాగా మారిపోయారు...
నిసాయి “ఖసాయసే అమీరుల్ మొమినీన్” అను పుస్తకం వ్రాస్తే అతను షియాగా మారిపోయారు, అని అన్నారు. “తబరీ” కొన్ని విశిష్టతలను ప్రస్తావిస్తే అతనూ షియా మారిపోయారు, అని అన్నారు. “ఇబ్నె ఖుతైబహ్” చరిత్ర వ్రాస్తే ఇతనూ షియాగా మారిపోయారు, అని అన్నారు. చివరికి ఇప్పటి ప్రముఖ రచయితలలో తాహా హుసైన్ “అల్ ఫిత్నతుల్ కుబ్రా” వ్రాస్తే అతను కూడా షియాగా మారిపోయారు అని అన్నారు., ఇతను గదీర్ హదీసును ప్రస్తావించి చాలా యదార్థాలను అంగీకరించారు. నిజానికి ఇందులో ఏ ఒక్కరూ షియా కాదు. షియాల పట్ల వీళ్ల వ్యతిరేక అభిప్రాయాలు గ్రంథములలో కనిపిస్తాయి.
విషయం ఏమిటంటే ఎవరైనా సరే అహ్లెబైత్[అ.స]ల ప్రశిష్టతలను ప్రస్తావించి సహాబీయుల తప్పులను ఒప్పుకుంటే చాలు అతని ప్రస్తావన మూల్యాన్ని తగ్గించాలని అతనిని “షియా” అని నిందిస్తారు. చివరికి ఒకవేళ ఎవరైన దురూద్లో అహ్లెబైత్[అ.స]లను కూర్చితే లేదా అలీ[అ.స]ను “అలైహిస్సలామ్” అని చెబితే చాలు అతను కూడా షియా అని లెక్కించేయబడతాడు, అని భావిస్తారు. [సహీ బుఖారీ, భాగం1, పేజీ 127-130] ఇదంతా ఒక ప్లాను ప్రకారం చేస్తున్న చర్య.
రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం1, పేజీ 127-130, భాగం 2, పేజీ 126 మరియు 205.
వ్యాఖ్యానించండి