హజ్రత్ ఉస్మాన్ ను ఎవరు చంపారు అన్న విషయం పై చరిత్ర ఏమని చేబుతుంది...
“ఖలీఫతుల్ ముస్లిమీన్ ఉస్మాన్”ను ఎందుకు చంపారని ప్రశ్నిస్తే రెండు వాక్యాలలో పూర్తి సంఘటనను సంక్షిప్తంగా “ఈజిప్టుకు చెందిన అవిశ్వాసుల ఒక సమూహం వచ్చి చంపేశారు” అని చెబుతారు.
కాని యదార్థమేమిటంటే ఉస్మాన్ను సహాబీయులే చంపారు. వారిలో ముందుగా ఉమ్ముల్ మొమినీన్ ఆయెషా పేరు వస్తుంది. ఆమె ఉస్మాన్ను చంపేయ్యండి అని ప్రకటించింది. “ఉఖ్తులూ నఅసల్ ఫఖద్ కఫర్; నఅసల్(నఅసల్ ఒక యూధుడు, ఉస్మాన్ గడ్డం వాడిలా ఉండటంతో ఆయెషా అతనిని అలా పిలిచేవారు)ను చంపేయ్యండి ఎందుకంటే అతను కాఫిర్ అయిపోయాడు”[తబరి, భాగం4, పేజీ 407]
ఆమె తరువాత వచ్చే పేర్లు “తల్హా” “జుబైర్” లాంటి పెద్ద పెద్ద సహాబీయులు. ముట్టడి సమయంలో నీళ్ళను అందకుండా చేసి రాజీనామా చేయమని బలవంతం చేశారు. చరిత్రకారుల ఉల్లేఖనానుసారం ఈ సహాబీయులే అతనిని ముస్లిముల స్మశానంలో సమాధి చేయనివ్వలేదు. చివరికి “హిష్షు కౌకబ్” అను యూధుల స్మశానంలో సమాధి చేశారు.
అలాంటి సమయంలో అతను బాధించి చంపబడ్డారు, అతనిని అవిశ్వాసుల ఒక సమూహం చంపింది. అని ఎలా చెప్పగలరు?....
రిఫ్రెన్స్
తబరి, భాగం4, పేజీ 407 / ఇబ్నె అసీర్, భాగం 3, పేజీ 206 / లిసానుల్ అరబ్, భాగం 14, పేజీ 139 / తాజుల్ ఉరూస్, భాగం8, పేజీ 141 / అల్ అఖ్దుల్ ఫరీద్, భాగం 4, పేజీ 290.
వ్యాఖ్యానించండి