ప్రతి అవమానంలోనూ, ప్రతి అపహాస్యంలోనూ, ప్రతి ఓటమిలోనూ,ప్రతి అడ్డంకిలోనూ, ప్రతి సంఘర్షణలోనూ సహనాన్ని పాటించిన వారే తప్పక విజయులవుతారు.
దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక రోజు ఒక దారి గూండా వెళుతుండగా ఒక చోట ఒక వ్యక్తి తన బలాన్ని పరీక్షిస్తూ ఆ నాడు శక్తివంతులు మరియు బలవంతుల రాయిగా పిలవబడే ఒక బండరాయిని ఎత్తుతున్నాడు దానిని చూస్తున్న ప్రజలు అతినిని పొగుడుతూ అతని పనిని ప్రోత్సాహిస్తున్నారు.అది చూసి దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఇచట ప్రజలు గుమిగూడటానికి కారణమేమిటి? అని ప్రశ్నించారు.దానికి వారు ఇక్కడ ఒక వ్యక్తి తన బలాన్ని ప్రదర్శిస్తున్నాడు అని అన్నారు.దానికి దైవప్రవక్త [స.అ.వ] ల వారు “నేను మీకు నిజమైన బలవంతుడు మరియు శక్తివంతుడెవరో చెప్పనా?” అని అన్నారు. “నిజమైన శక్తివంతుడెవరంటే తనను ఎవరైనా తిట్టినప్పుడు కోపగించుకోకుండా సహనంతో తన మనస్సును అదుపులో పెట్టుకునేవాడు” అని అన్నారు. ప్రతి అవమానంలోనూ, ప్రతి అపహాస్యంలోనూ, ప్రతి ఓటమిలోనూ,ప్రతి అడ్డంకిలోనూ, ప్రతి సంఘర్షణలోనూ సహనాన్నిపాటించినవారే నిజమైన బలవంతులు మరియు విజయం వారినే వరిస్తుంది.
రెఫరెన్స్: మజ్మూఅయే వరాం,2వ భాగము,పేజీ నం:10.
వ్యాఖ్యానించండి