అమవీ అధికారుల లక్ష్యం మరియు వారికి వ్యతిరేకంగా తిరగబడిన తిరుగుబాటు సంఘాల గురించి సంక్షిప్త వివరణ...
అమవీయుల అధికారులు ఇస్లామీయ దేశాల సంఖ్యను పెంచేందుకు తూర్పుదిశ సరిహద్దుల వైపు మరియు రూమ్ సరిహద్దుల వైపు యుద్ధాలు చేశారు దాంతో ఇస్లామీయ అధికార పరిపాలనా ప్రదేశాలు పెరిగాయి. తమ బలాన్ని పెంచటంతో పాటు ఇమామ్ అలీ[అ.స]ను ఇష్టపడేవారిని కష్టపెట్టటం వారి రాజకీయ ముఖ్యాంశాలలో ఒకటి అందుకు స్పష్టమైన ఉదాహారణ కర్బలా సంఘటన; అమవీయులు, హాషిమీయుల పట్ల పాత కక్షలను మరచిపోలేదు.
అమవీయుల అధికారంలో ఐదుగురు ఇమాములు తమ జీవితాన్ని గడిపారు; వారు: ఇమామ్ హసన్[అ.స]. ఇమామ్ హుసైన్[అ.స], ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స], ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స], ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] కర్బలా సంఘటన తరువాత వీళ్ళలో ఎక్కువ శాతం ఇమాములు ఈ అమవీ దుర్మార్గపు అధికారుల ముందు మౌనంగా మరియు తఖియ్యహ్ లోనే తమ జీవితాలను గడిపారు. అమవీ దుర్మార్గపు అధికారులకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన వారు కూడా ఉన్నారు ఉదాహారణకు; ఇమామ్ హుసైన్[అ.స], జనాబె ముఖ్తార్, జనాబె జైద్ మొదలగువారు.
రిఫ్రెన్స్
http://ur.welayatnet.com/node/2468
వ్యాఖ్యానించండి