నమాజు ఎప్పుడు విధిగా చెయబడింది అన్న ప్రశ్నకు చరిత్రానుసారంగా జవాబును వివరించటం జరిగింది.
ప్రపంచ ముస్లిములు ఐదుపూట్ల చేసే నమాజు ఎప్పుడు విధిగా చేయబడింది?అంటే అందరూ "షబె మేరాజ్ అల్లాహ్ దైవప్రవక్త[స.అ.వ]ల వారికి మేరాజ్ పైకి పిలిచి ఐదుపూట్ల నమాజును ఒక వరముగా అందించటం జరిగింది" అని చెబుతారు. కానీ యదార్ధమేమిటి అని ప్రశ్నిస్తే అయతుల్లాహ్ జఫరె సుబ్ హాని దాని గురించి ఈ విధంగా చెబుతున్నారు: వాస్తవంగా చరిత్ర మరియు హదీసులు చెప్పేదేమిటంటే మేరాజ్ యొక్క రాత్రి దైవప్రవక్త[స.అ.వ]ల వారి ఉమ్మత్ పై ఐదుపూట్ల నమాజు విధిగా చేయబడింది. చరిత్రానుసారం హజ్రత్ అబూతాలిబ్[అ.స]ల వారు బ్రతికి ఉన్నంతవరకు నమాజు విధిగా చేయబడలేదు. మరియు చరిత్రకారులు కూడా హిజ్రత్ కు కొన్ని రోజుల ముందు నమాజును విధిగా చేయటం జరిగిందని నమ్ముతున్నారు దానికి సాక్ష్యంగా తుఫైల్ ఇబ్నె అమ్ర్ హిజ్రత్ కు కొంత సమయం ముందు ఇస్లాము స్వీకరించటాన్ని మరియు దైవప్రవక్త[స.అ.వ]ల వారు అతనికి కేవలం షహదతైన్[లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదున్ రసూలుల్లాహ్] నేర్పటం దానితో పాటు నమాజు యొక్క ప్రస్థావన రాకపోవటం ఆ నాటికి నమాజును విధిగా చేయలేదనటానికి సాక్ష్యము. మరియు షైఖ్ కులైని ల వారు కూడా దైవప్రవక్త[స.అ.వ] ల వారిపై నమాజు మేరాజ్ యొక్క రాత్రి నుండే విధిగా చేయబడిందని నమ్ముతారు దానికి సాక్ష్యంగా వారు కూడా మేరాజ్ రాత్రి అల్లాహ్ దైవప్రవక్త[స.అ.వ] ల వారిని తన వహీ ద్వారా వుజూ మరియు నమాజు నేర్పే సంఘటనను వివరంగా ప్రస్థావించటం జరిగింది.
రెఫరెన్స్: ఇమాం ఖుమైని,సిర్రుస్సలాత్,అల్లామా మజ్లిసి,బిహారుల్ అన్వార్,79వ భాగము,పేజీ నం:252.
వ్యాఖ్యానించండి