ఈ లొకంలో అన్ని రకాల సుఖ సౌకర్యాలకు అలవాటు పడి దానిని ప్రేమించే వాడు ఎప్పుడూ మృత్యువుకు భయపడుతూనే ఉంటాడు.
ఇమాం ముహమ్మద్ తఖి[అ.స] ల వారితో ఎందుకు మానవులు మృత్యువుతో భయపడతారు?అని ప్రశ్నించారు.దానికి ఇమాం ల వారు “వారికి మృత్యువు పట్ల అవగాహన లేదు అందుకంటే మృత్యువును ఇష్టపడరు,ఒక వేళ దాని గురించి తెలుసుకుంటే అల్లాహ్ దాసులలో లెక్కింపబడేవారు,మృత్యువును ఇష్టపడేవారు మరియు పరలోకం తమకోసం ఈ లోకం కన్నా మేలైనదని తెలుసుకునేవారు” అని అన్నారు.మృత్యువంటే కొందరికి భయం మరికొందరికి ఇష్టం.భయమెందుకంటే ఇంతటి సుఖభరితమైన జీవితం తరువాత మృత్యువు వస్తే మన పరిస్థితి ఏమిటి? ఆ తరువాత ఏం జరుగుతుందో?అన్న భయం.కొన్ని హదీసులలో మృత్యువుకు భయపడటానికి కారణం మానవుడు ఈ ప్రాపంచిక జీవితాన్ని అన్ని రకాలుగా సుఖసంపన్నంగా మార్చుకుని పరలోకాన్ని మరచిపోవటమే.ఎవరైతే ఈ లోకాన్ని సుఖ సంపన్నమైన స్థానంగా మార్చుకుని దానిని ప్రేమిస్తారో వారు ఎలా ఈ సుఖభరిత జీవితాన్ని వదలటానికి ఇష్టపడతారు? ఎవరికైతే మృత్యువు పట్ల సరైన అవగాహన ఉండదో దానికి భయపడుటూనే ఉంటారు.కానీ మృత్యువంటే ఏమిటి? పరలోకంలో కూడా ఇలాంటి సుఖభరిత జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలి?అని ఆలోచించి దానికి సరిపడా ఏర్పాట్లు చేసుకున్న వాడు ఎప్పుడూ మృత్యువుకు భయపడడు.
రెఫరెన్స్: మౌసూ అతొ కలిమాతిల్ ఇమాం అల్ జవాద్,పేజీ నం:147.
వ్యాఖ్యానించండి