అమరవీరులైన సర్దార్ ఖాసిమ్ సులైమానీ ఆయతుల్లాహ్ ఖామెనయీతో ఎలా కలిశారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
“ఇరాన్” యొక్క “కిర్మాన్” రాష్ట్రంలో ఉన్న “రాబర్” అనే సిటీకి చెందిన హసన్ సులైమానీ ఇంట ఇస్ఫన్ద్ నెల(ఇరాన్ క్యాలండర్ ప్రకారం 12వ నెల) 20వ తేదీన ఒక పిల్లాడు జన్మించాడు. తండ్రి తన కుమారుడిని “ఖాసిమ్” అని నామకరించారు. ఖాసిమ్ 13 సంవత్సరాల వయసులో స్కూల్ చదువు పూర్తయిన తరువాత “రాబర్” పట్టణాన్ని విడిచారు. 18 ఏళ్ల వయసులో కిర్మాన్ లో Water Organization Contractor అయ్యారు. వారు కసరత్తు చేసేవారు అలాగే కరాటే నేర్చుకున్నారు, Bodybuilding Instructor గా కూడా యువకులకు శిక్షణ ఇచ్చేవారు.
ఇరాన్ స్వాతంత్రానికి రెండు సంవత్సరాల ముందు మష్హద్ చుట్టుప్రక్కల ప్రదేశానికి చెందిన హుజ్జతుల్ ఇస్లామ్ “రిజా కామియాబ్” కిర్మాన్ పట్టణానికి రమజాన్ మాసంలో వచ్చినప్పుడు వారితో పరిచయం పెరిగి విప్లవకారుల బ్రుంధంతో కలిశారు. వారిద్దరి స్నేహం చాలా రోజుల వరకు సాగలేదు ముర్దాద్ మాసం 7వ తేది (ఇరానీ సంవత్సర కౌటింగ్ ప్రకారం) 1360వ సంవత్సరంలో “సాజెమానె ముజాహిదీనె ఖల్ఖ్” “కామియాబ్” ను హతమార్చారు. కాని ఆ కొద్ది కాలంలోనే “ఖాసిమ్ సులైమానీ”కు “మష్హద్” కు చెందిన ఆయతుల్లాహ్ “సయ్యద్ అలీ ఖామెనయీ” పరిచయమయ్యారు మరి వారి స్నేహం ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది... కాని “సర్దార్ ఖాసిమ్ సులైమానీ” జనవరి 4వ తేది అర్ధరాత్రి తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుల అనుసారం చంపబడ్డారు.
రిఫ్రెన్స్
తహ్లీలియె ఖబరియె అస్రె ఇరాన్/ హౌజా నెట్.కామ్
వ్యాఖ్యానించండి