మానవునిపై నిర్లక్ష్యం వలన కలిగే ప్రభావాల గురించి ఇమాం అలి[అ.స] ల వారి ఉల్లేఖనం.
మానవునిపై నిర్లక్ష్యం యొక్క ప్రభావాన్ని వివరిస్తూ ఇమాం అలి[అ.స] ల వారు నెహ్జుల్ బలాఘా లో ఈ విధంగా సెలవిస్తున్నారు:
“మృత్యువు యొక్క స్మరణం మీ హృదయాల నుండి వెళ్ళిపోయింది.మోసపూరిత వాంచలు ఆ స్థానాన్ని స్వాధీనం చేసుకున్నాయి.ఈ లోకం[వారికి] పరలోకం కంటే గొప్పగా మారింది,మరియు ఈ లోకం పరలోకాన్ని మరిచిపోయేలా చేసింది. నిశ్చయంగా మీరు ధర్మ రీత్యా ఒకరికొకరు సోదరులు.ఏ వస్తువు మిమ్మల్ని వేరుచేయలేదు,మీ మనసులలో [ఒకరికొకరు పెంచుకున్న] అపవిత్ర మరియు అశుధ్ధమైన చెడు ఆలోచనలు తప్ప. ఒకరికొకరు సహాయపడరు మరియు ఒకరి మంచిని వేరొకరు కోరుకోరు.ఒకరికొకరు [ఏదైన వస్తువును] ఇచ్చిపుచ్చుకోవటం కూడా చేయరు,ఒకరినొకరు ఇష్టపడరు కూడా,మీరు సంపాదించిన కొద్దిపాటి [ప్రాపంచిక సంపాదనలో] మీకు సంతృప్తిని కలిగించేదేమిటి?ఎక్కువ మాత్రంలో పోయే పరలోక సంపద పట్ల మీరు దుఖ్ఖించరా?కొద్దిపాటి ఈ లోకసంపదను కోల్పోవటం మీ యొక్క మనశ్శాంతిని పోయేలా చేస్తుంది.అయితే ఆ అశాంతి మీ ముఖాలలో స్పష్టంగా కనబడుతుంది మరియు వారు సాధించని దానిపై అసహనంగా ఉండటం కూడా. ఎలాగంటే ఈ ప్రాపంచిక జీవితం మీ యొక్క శాస్వత నిలమైనట్లుగా మరియు దాని ద్వారా వచ్చే లాభము శాస్వతమైనట్లుగా”.
రెఫరెన్స్: నెహ్జుల్ బలాఘా,13వ ఉపన్యాసం.
వ్యాఖ్యానించండి