ఉల్లేఖించబడి ఉన్న ఇమామ్ అలీ[అ.స] ప్రతిష్టలతో అబూబక్ర్ ప్రతిష్టతలను పోల్చిచూస్తే అహ్లెసున్నత్ పుస్తకాలలో కూడా తప్పకుండా అంత ఎక్కువగా ఉండి ఉండవు.
ఉల్లేఖించబడి ఉన్న ఇమామ్ అలీ[అ.స] ప్రతిష్టలతో అబూబక్ర్ ప్రతిష్టతలను పోల్చిచూస్తే అహ్లెసున్నత్ పుస్తకాలలో కూడా తప్పకుండా అంత ఎక్కువగా ఉండి ఉండవు. మరియు ఆ ఉన్న రివాయత్లు కూడా అతని కుమార్తె హజ్రత్ ఆయెషా ఉల్లేఖించినవే, అందుకు కారణం కూడా తెలిసిందే. అదేమిటంటే హజ్రత్ అలీ[అ.స] శత్రుత్వం వల్ల తన తండ్రిని అన్ని విధాలుగా సమర్ధించుకోవాలని, అందుకోసం నకిలీ రివాయతులు తయారు చేయడానికి కూడా వెనకాడలేదు. లేదా అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఉల్లేఖనలు ఉన్నాయి. ఇతను ఇమామ్ అలీ[అ.స]ను అస్సల ఇష్టపడేవాడు కాదు. ముస్లిములందరు బైఅత్ చేసిన తరువాత కూడా అతను ఇమామ్ అలీ[అ.స]తో బైఅత్ చేయలేదు. అంతే కాకుండా దైవప్రవక్త[స.అ] తరువాత అందరిలో ప్రతిష్టగల వారు అబూబక్ర్ ఆ తరువాత ఉమర్ ఆ తరువాత ఉస్మాన్ మరి ఆ తరువాత ఏ ఒక్కరు ప్రతిష్టులు కారని, అందరూ సమానమని ప్రకటిస్తూ ఉండేవాడు.[సహీ బుఖారీ, భాగం 2, పేజీ 202]
రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, విధ్వాసులతో సంభాషణ అధ్యాయంలో. సహీ బుఖారీ, భాగం 2, పేజీ 202.
వ్యాఖ్యానించండి