ప్రజలు ఇష్టానుసారంగా ఎన్నుకున్న ఏకైక ఖలీఫా ఎవరు అన్న విషయంపై సంక్షిప్త వివరణ...
హజ్రత్ అలీ[అ.స] తరువాత ఖిలాఫత్ పదవిని ముఆవియా ఆక్రమించాడు. అతను ఇస్లాం ఖిలాఫత్ని చక్రవర్తి రాజ్యంగా మార్చేశాడు. అప్పటినుండి బనీ ఉమయ్యా మరియు బనీఅబ్బాస్ వంశపరంగా రాజ్యాన్ని ఎలుతూ వచ్చారు. ప్రతీ ఖలీఫా తన పూర్వీకులను చూపించి, బలం మరియు ఆయుధాల ఒత్తిడితో ఖిలాఫత్ను పొందుతూ ఉండే వాడు. బైఅత్ మరియు అభిప్రాయ వ్యక్తానికి పూర్తిగా విలువ లేకుండా పోయింది. దీనిని క్లుప్తంగా చెప్పాలంటే మొత్తం ఇస్లాం చరిత్రలోనే ఖలీఫాల కాలం నుండి “కమాల్ అతాతుర్క్” కాలం వరకు ఏ ఒక్క ఖలీఫాతో కూడా సరిగా బైఅత్ అవ్వలేదు. ఇరువైపు వర్గాల తరపు నుండి తమ ఇష్టానుసారంగా ఎటువంటి బలవంతం లేకుండా బైఅత్ పోందిన ప్రఖ్యాతి, ప్రసిధ్ధి ఎవరికైన దక్కిందీ అంటే అది కేవలం ఇమామ్ అలీ[అ.స]కు మాత్రమే.
రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అలీ[అ.స]యే అనుచరణకు అర్హులు అధ్యాయంలో.
వ్యాఖ్యానించండి