మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన అవసరమేమిటి? అన్న ప్రశ్నకు జవాబు సంక్షిప్తంగా.
మంచి జీవితాన్ని గడిపేదెట్లాగా?నా జీవిత ధ్యేయమేమిటి?ఎక్కడ నుంచి వచ్చాను?నా లక్ష్యమేమిటి? ఇలాంటి ప్రశ్నలే మనిషి భవిత్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ ప్రపంచంలో ప్రతీది ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా ఉంటుంది.తేనెలో తీపి,గులాబీలో పరిమళం,కుక్కలో విశ్వాసం,భూమిలో ఉండే ఉపయోగపడే స్వభావం ఇవన్ని ఎప్పటికీ మారవు.చేప నేలపై బ్రతకలేదు,నేలమీద పాకే జంతువులు గాలిలో ఎగరలేవు.కానీ మనిషి స్వభావం వేరు.అతడు తన ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా ప్రవర్తించడు.అతడిలోని చెడు లక్షణాలు మంచి లక్షణాలపై స్వారీ చేస్తాయి.కోపము,కామము,ఈర్ష్య,దురాశ,గర్వం వంటి చెడు లక్షణాలు అతడిని నడిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అతడు తనతో తాను పోరాడి,కష్టాలను అధిగమించి తన జీవిత ధ్యేయమైన పరిపూర్ణత అనే దశకు చేరుకుని ఆ దైవానికి దగ్గరవుతాడో అప్పుడే అతడు తన జీవిత ధ్యేయాన్ని మరియు ఏ లక్ష్యంతో అయితే ఆ పరమేశ్వరుడు అతడిని సృష్టించాడో ఆ లక్ష్యాన్ని చేరుకున్నవాడవుతాడు.అలా కాకపోతే అతడికి ప్రళయదినాన పశ్చాత్తాపం తప్పదు.దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: “ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి ముందుగా పంపుకున్న దానిని చూసుకుంటాడు.అప్పుడు అవిశ్వాసి అయ్యో! నేను మట్టినయిపోయినా బాగుండేదే! అనంటాడు” [అన్ నబా/40].అందుకే ఆ సమయం రాక ముందే మనల్ని మనం ప్రశ్నించుకుంటే మంచిది.
వ్యాఖ్యానించండి