ఈ హదీస్ పట్ల అహ్లెసున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన ఇబ్నె అరబీ యొక్క అభిప్రాయం...
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు:
“ఇస్లాం ధర్మం ప్రళయదినం వరకు సాగుతుంది మీ కొరకు పన్నెండు ఖలీఫాలతో, వారందరూ ఖురైష్ వంశానికి చెందినవారై ఉంటారు”.[సహీ మస్లిం(అరబీ), భాగం3, పేజీ1453, హదీస్ నెం10]
ఈ హదీస్ పట్ల అహ్లెసున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన ఇబ్నె అరబీ యొక్క అభిప్రాయం:
మేము దైవప్రవక్త[స.అ] తరువాత పన్నెండు నాయకులను లెక్కిబెట్టాము, ఈ క్రిందివారిని పొందాము:
అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్, అలీ, హసన్, ముఆవియహ్, యజీద్, ముఆవియహ్ ఇబ్నె మర్వాన్ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె మర్వాన్, అల్ సఫాహ్..... ఆ తరువాత బనీ అబ్బాస్ కు చెందిన 7 ఖులీఫాలు.
ఒకవేళ మేము వారి నుండి; లెక్కప్రకారం పన్నెండును ఖలీఫాలనే చూసినట్లైతే మేము కేవలం “సులైమాన్” వరకు మాత్రమే చేరుతాము. ఒకవేళ మేము దాని వాచ్యార్థమును చూసినట్లైతే వారిలో కేవలం ఐదుగురే ఉన్నారు; నాలుగు “ఖులఫాయే రాషిదీను”లు మరియు “ఉమర్ ఇబ్నె అబ్దుల్ అౙీజ్”. నేను ఈ హదీస్ యొక్క భావాన్ని అర్థం చేసుకోలేకపోయాను.
రిఫరెనస్
సహీ మస్లిం(అరబీ) కితాబుల్ అమారహ్(తబఅ సౌదీ అరబ్ 1980), భాగం3, పేజీ1453, హదీస్ నెం10; ఇబ్నె అల్ అరబీ, షర్హె సునన్ అల్ తిర్మిజీ, మిజీ, 9:69-69.
వ్యాఖ్యానించండి