ఈ హదీస్ పట్ల అహ్లెసున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన ఇబ్నె అల్ జౌజీ యొక్క అభిప్రాయం...
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు:
“ఇస్లాం ధర్మం ప్రళయదినం వరకు సాగుతుంది మీ కొరకు పన్నెండు ఖలీఫాలతో, వారందరూ ఖురైష్ వంశానికి చెందినవారై ఉంటారు”.[సహీ మస్లిం(అరబీ), భాగం3, పేజీ1453, హదీస్ నెం10]
ఈ హదీస్ పట్ల అహ్లెసున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన ఇబ్నె అల్ జౌజీ యొక్క అభిప్రాయం:
బనీ ఉమయ్యహ్ యొక్క మొదటి ఖలీఫహ్ యజీద్ ఇబ్నె ముఆవియహ్ మరియు చివరి(ఖలీఫా) మర్వాన్ అల్ హిమార్. వారి మొత్తం సంఖ్య పదమూడు. ఉస్మాన్, ముఆవియహ్ మరియు ఇబ్నె ౙుబైర్ ను వారితో పాటు లెక్కబెట్టలేదు ఎందుకంటే వారు దైవప్రవక్త[స.అ] సహచరుల నుండి కాబట్టి. ఒకవేళ మేము మర్వాన్ ఇబ్నె హకమ్ ను అతడి సహచరత్వం పట్ల వివాదం కారణంగా లెక్కించకుండా లేక అబ్దుల్లాహ్ ఇబ్నె జుబైర్కు జనం మద్దత్తు ఇచ్చిన తరువాత కూడా అతడు అధికారంపైనే ఉన్నాడని భావించినట్లైతే, అప్పుడు మేము పన్నెండు సంఖ్యను పొందగలము... ఖిలాఫత్, “బనీ ఉమయ్యాహ్” చేతుల నుండి బయటికి వచ్చినప్పుడు చాలా విద్రోహం జరిగింది, మరి అది బనీ అబ్బాస్లు తమ (అధికారం)ను పటిష్టం చేసుకోనంత వరకు సాగుతూనే ఉంది. అలా పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇలా అని అల్ జౌౙీ, కష్ఫుల్ ముష్కిల్ లో, ఇబ్నె హజర్ అల్ అస్కలానీ, ఫత్హుల్ బారీ, 16:340లో “సిబ్తె అల్ జౌౙీ” నుండి ఉల్లేఖించారు.
రిఫరెన్స్
సహీ మస్లిం(అరబీ) కితాబుల్ అమారహ్(తబఅ సౌదీ అరబ్ 1980), భాగం3, పేజీ1453, హదీస్ నెం10.
వ్యాఖ్యానించండి