ఈ హదీస్ పట్ల అహ్లెసున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన ఖాౙీ అయాజ్ అల్ యహ్సూబీ యొక్క అభిప్రాయం...
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు:
“ఇస్లాం ధర్మం ప్రళయదినం వరకు సాగుతుంది మీ కొరకు పన్నెండు ఖలీఫాలతో, వారందరూ ఖురైష్ వంశానికి చెందినవారై ఉంటారు”.[సహీ మస్లిం(అరబీ), భాగం3, పేజీ1453, హదీస్ నెం10]
ఈ హదీస్ పట్ల అహ్లెసున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన ఖాౙీ అయాజ్ అల్ యహ్సూబీ యొక్క అభిప్రాయం:
ఖలీఫాల సంఖ్య దానికి మించి ఉంది. వారి సంఖ్యను పన్నెండుకు పరిమితం చేయడం తప్పు. వారు కేవలం పన్నెండు మాత్రమే అయి ఉంటారు అంతకు మించి ఉండరు అని దైవప్రవక్త[స.అ] అనలేదు.
“అల్ జువైనీ” ఇలా అని కూడా ఉల్లేఖించారు: దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “నేనూ, అలీ, హసన్, హుసైన్ మరియు హుసైన్ నుండి తొమ్మిది మంది పవిత్ర మాసూమలు మరియు ఇమాములు”.
ఇస్లాం యొక్క వర్గాలన్నీంటిలో కేవలం (పన్నెండు ఇమాములను నమ్మే) ఇస్నా అషరీ షియాలు మాత్రమే వారిని దైవప్రవక్త[స.అ] యొక్క పన్నెండు నిజమైన ఉత్తరాధికారులు అని నమ్ముతారు, మరి వారి నుండి ఇస్లాం గురించి తెలుసుకుంటారు.
రిఫరెన్స్
సహీ మస్లిం(అరబీ) కితాబుల్ అమారహ్(తబఅ సౌదీ అరబ్ 1980), భాగం3, పేజీ1453, హదీస్ నెం10/ అల్ జువైనీ, ఫరాయిద్ అల్ సిమ్తైన్, మూనిస్తహుల్ మహ్మూదీ, తబఅ బీరూత్1978, పేజీ160.
వ్యాఖ్యానించండి