పన్నెండు ఖలీఫాలను వివరిస్తున్న అహ్లె సున్నత్ రావీ అయిన అల్ జువైనీ రివాయత్ ఉల్లేఖనం...
పన్నెండు ఖలీఫాలను వివరిస్తున్న అహ్లె సున్నత్ రావీ అయిన అల్ జువైనీ రివాయత్ ఉల్లేఖనం:
“అల్ జువైనీ” “ఇబ్నె అబ్బాస్” ద్వార మరెన్నో రివాయతుల ఉల్లేఖనంతో పాటు ఈ రివాయత్ ను కూడా ఉల్లేఖించారు: దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “నిస్సందేహంగా నా తరువాత నా ఖులఫా మరియు నా ఉత్తరాధికారులు మరియు అల్లాహ్ యొక్క సృష్టితాల పై హుజ్జత్ (సాక్ష్యం) పన్నెండు మంది. వారిలో మొదటి వారు నా సోదరుడు, మరియు చివరి వారు నా కుమారుడు నా సంతానానికి చెందినవారు”. వారి[స.అ]తో ఇలా ప్రశ్నించారు: “యా రసూలల్లాహ్! మీ సోదరుడు ఎవరు?. వారు[స.అ] “అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]” అన్నారు. మరలా “మీ కుమారుడెవరు?” అని ప్రశ్నించారు. దైవప్రవక్త[స.అ] “మహ్దీ, వారు అన్యాయంతో నిండి ఉన్న భూమిని న్యాయధర్మాలతో నింపేస్తారు. మరియు నన్ను సందేశహరుఁడు మరియు శువార్త వినిపించేవానిగా నిశ్చయించి అవతరింపజేసిన వాని సాక్షిగా, ఒకవేళ ఈ ప్రపంచం యొక్క ఒక్కరోజు మిగిలి ఉన్నా, అల్లాహ్ ఆ రోజును నా కుమారుడు మహ్దీను పంపేంత వరకు పెంచుతాడు. ఆ తరువాత అల్లాహ్ ఈసా ఇబ్నె మర్యమ్ [అ.స]ను అవతరింపజేస్తాడు, వారు ఆ మహ్దీ వెనక నమాజ్ చదువుతారు. భూమి ప్రభువు కాంతితో ప్రకాశిస్తుంది, మరియు అతని అధికారం తూర్పుపడమరాల వరకు వ్యాపిస్తుంది.
రిఫరెన్స్
అల్ ౙహబీ, తౙ్ కిరతుల్ హుఫ్ఫాౙ్, భాగం4, పేజీ298/ ఇబ్నె హజర్ అల్ అస్కలానీ, దుర్రుల్ కామినహ్, భాగం1, పేజీ67.
వ్యాఖ్యానించండి