ఎంతో ప్రాముఖ్యత మరియు ప్రత్యేకతలున్న పవిత్ర రమజాను మాసం ఆ దేవుని సామిప్యాన్ని పొందటానికి ఒక మంచి అవకాశం.అలాంటి మంచి అవకాసాన్ని వదులుకున్న వాడు తనకు తాను నష్టాన్ని చేకూర్చుకున్నవాడవుతాడు.
పవిత్ర రమజాన్ మాసము ఆ దేవుని సామిప్యాన్ని పొందటానికి ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు.ఆ దేవుని సామిప్యాన్ని పొందటమంటే ఏమిటి?నిజంగా దాని అనుభవం ఎలా ఉంటుంది? సాదారణంగా జీవించే ఒక వ్యక్తి మరియు ఆ దేవుని సామిప్యాన్ని పొందిన వ్యక్తి యొక్క జీవితం మధ్య చాలా తేడా ఉంది.సాదారణంగా పవిత్ర మాసూముల సమాధుల వద్ద మనకు కొద్ది సేపు గడిపితేనే ఒక రకమైన మంచి అనుభూతి కలుగుతుంది అదే ఆ దేవుని సామిప్యన్ని పొందితే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఆ దేవుని సన్నిధిలో మన పాపాలకు క్షమాపణ లభించినప్పుడు,మన ప్రార్ధనలు మరియు మంచి కార్యాలను కేవలం ఆ అల్లాహ్ కొరకే చేసినప్పుడు,కేవలం ఆ అల్లాహ్ కొరకే పాపాల నుండి దురంగా ఉన్నప్పుడు,ఒక్క నిమిషం కూడా ఆ అల్లాహ్ పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని పట్ల ధ్యాసను చూపినప్పుడు ఆ దేవుని సామిప్యం యొక్క అనుభవాన్ని పొందామని చెప్పవచ్చు. ఇలాంటి వారి లక్షణాలను దివ్యఖురాను ఈ విధంగా వివరిస్తుంది: “వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు.నమాజులను నెలకొల్పుతారు.మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ,బహిరంగంగానూ,ఖర్చుపెడతారు.చెడును సయితం మంచితనంతో పార ద్రోలుతారు.అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే” [అర్ రాద్/22].
వ్యాఖ్యానించండి