ఇస్లాం యొక్క ఈ స్పష్ట ఆదేశాలకు ప్రతిఘటనగా హేతుబద్ధం మరియు పరియాలోచన బుద్ధి వల్ల సహాబీయులలో ఒక ప్రత్యేక సంఘం ఏర్పడింది..
ఇస్లాం యొక్క ఈ స్పష్ట ఆదేశాలకు ప్రతిఘటనగా హేతుబద్ధం మరియు పరియాలోచన బుద్ధి వల్ల సహాబీయులలో ఒక ప్రత్యేక సంఘం ఏర్పడింది మరి ఆ సంఘానికి ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ నాయకత్వం వహించేవారు. వీళ్ళే గురువారం రోజు స్పష్ట ఆదేశానికి వ్యతిరేకించి కలం కాగితం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతోనే అర్ధమౌతుంది ఈ సహాబీయులు గదీర్ ఆదేశాన్ని ఒక్కరోజు కూడా నమ్మి అంగీకరించలేదని. దానిని బహిరంగంగా నిరాకరించడానికి దైవప్రవక్త[స.అ] మరణానంతరం వాళ్ళకు అవకాశం దొరికింది. అప్పుడు సఖీఫాలో ఏకమై అబూబక్ర్ ను ఎన్నుకున్నారు. మరి ఈ విషయాన్ని కూడా పరియాలోచన అని నిర్ధారించేశారు. దాని ఫలితంగా ఖిలాఫత్ యొక్క స్పష్టమైన ఆదేశాలను రద్దు చేయడం జరిగింది. అలా ప్రతీ విషయంలో స్వయపరియాలోచన తలుపులు తెరుచుకున్నాయి. చివరికి అల్లాహ్ గ్రంథానికి విరుధ్ధంగా తమ పరియాలోచన వ్యక్తం చేసి సరిహద్దులను చెరిపి వేసి, ఆదేశాలను మార్చేయడానికి కూడా వెనకాడలేదు. హజ్రత్ ఇమామ్ అలీ[అ.స] ఖిలాఫత్ పదవి నుంచి దూరం చేసిన తరువాత సహించిన కష్టాల క్షోభతో నిండి ఉన్న సంఘటనలు మరియు జకాత్ ఇవ్వమని నిరాకరించిన వాళ్ళను చంపడం. ఇవన్నీ “నస్స్ (స్పష్టమైన ఆదేశాలు)కు వ్యతిరేకంగా చేసిన స్వయపరియాలోచన” ఫలితాలు.
వ్యాఖ్యానించండి