ఇమామ్ అలీ[అ.స] చేతికి ఖిలాఫత్ పదవి దక్కిన తరువాత వారు అల్లాహ్ ఆదేశాలను మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్ ను తీసుకొని రావలనుకున్నారు కాని...
హజ్రత్ అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్లు తమ ఖిలాఫత్ కాలానికి ముందు మరియు ఖిలాఫత్ పదవిలోకి వచ్చిన తరువాత ఇస్లాం ఆదేశాలను తమ స్వయపరియాలోచన మరియు అభిప్రాయాలతో చిందరవందర చేశారు. దైవప్రవక్త[స.అ] తరువాత 25 సంవత్సరాలు ఈ ముగ్గురు ఖిలాఫత్ పదవిలో ఉన్నారు. పరిస్థితి చాలా దిగజారిపోయింది. అలాంటి పరిస్థితుల తరువాత ఇమామ్ అలీ[అ.స] చేతికి ఖిలాఫత్ పదవి దక్కింది. అయితే అతనికి ఎదురైన అన్నీంటి కన్న పెద్ద సమస్య ప్రజలను దైవప్రవక్త[స.అ] సున్నత్ మరియు అల్లాహ్ చట్టం వైపుకు తిరిగి తీసుకొని రావడం. బిద్అత్లను తొలగించేయాలని, సున్నతులను నిలద్రొక్కుకునేటట్లు చేయడం. వీటికోసం అతను పూర్తి ప్రయత్నం చేశారు. కాని ప్రజలు “వా సున్నత ఉమరా; అయ్యో ఉమర్ సున్నత్” అని అనడం మొదలు పెట్టారు.
వ్యాఖ్యానించండి