మమూన్ యొక్క ఖిలాఫత్ లో ఇమాం ల వారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవటం జరిగింది.మామూన్ ఇమాం రిజా[అ.స] ల వారిని ఎన్నో సార్లు హేళన చేయటానికి మరియు వారిని ప్రజల ముందు అవమానపరచటానికి ప్రయత్నించటం జరిగింది.కానీ ఈ మామూన్ యొక్క ద్వంద్వ వైఖరి ప్రజల దృష్టిలో ఇమాం ల వారి వ్యక్తిత్వాన్ని మరియు వారి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించలేక పోయింది.
ఇమాం రిజా[అ.స] ల వారి ఇమామత్ యొక్క ఎక్కువ సమయం చాలా క్లిష్ట పరిస్థితులలోనే సాగింది.ఇమాం రిజా[అ.స] ల వారు ఎక్కువగా ఇస్లాము మరియు షీయా విశ్వాసాలకు వ్యతిరేకంగా వచ్చే అపోహలను తొలగించటానికి ఇతర మతపెద్దలతో ఎన్నో చర్చలు జరిపారు మరియు ఆ చర్చల నిమిత్తం ఎన్నో ప్రయాణాలు కూడా చేయటం జరిగింది.ముస్లిము సముదాయం వర్గాలుగా చీలిపోకుండా ఉండటానికి ఎంతో కృషి చేసారు.ముఖ్యంగా తన తండ్రి మరణానంతరం ఏర్పడ్డ వాఖిఫియా వర్గంతో ఎంతో పోరాడటం జరిగింది.198వ హిజ్రి లో తన సోదరుడైన అమీన్ పై యుద్ధంలో గెలిచిన మామూన్ షీయా సముదాయం యొక్క తిరుగుబాట్లను ఎదురుకోవటం జరిగింది.ఆ తిరుగుబాట్లను ఆపటానికి ఇమాం రిజా[అ.స] ల వారిని తన రాజ్యానికి గవర్నరుగా నియమించాడు.ఇమాం రిజా[అ.స] ల వారు ఆ పదవి పట్ల ఆసక్తిని చూపించకపోయినా,వారిని బలవంతంగా రాజధానికి రప్పించి ఆ గవర్నరు పదవిని అప్పగించటం జరిగింది. మమూన్ యొక్క ఖిలాఫత్ లో ఇమాం ల వారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవటం జరిగింది.మామూన్ ఇమాం రిజా[అ.స] ల వారిని ఎన్నో సార్లు హేళన చేయటానికి మరియు వారిని ప్రజల ముందు అవమానపరచటానికి ప్రయత్నించటం జరిగింది.కానీ ఈ మామూన్ యొక్క ద్వంద్వ వైఖరి ప్రజల దృష్టిలో ఇమాం ల వారి వ్యక్తిత్వాన్ని మరియు వారి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించలేక పోయింది.
వ్యాఖ్యానించండి