భక్తులు తమ విన్నపాలు మరియు కోరికలను ఆ దేవునితో కాకుండా మరెవ్వరితో విన్నవించుకొంటారు? కానీ దానికి కొన్ని విధానములు మరియు షరతులు ఉన్నాయి, వాటిని తెలుసుకొని ఆ అల్లాహ్ ను ప్రార్ధించడం మన కర్తవ్యం.
మనిషి దేవుని సన్నిధిలో ఎలా వేడుకోవాలి మరియు ప్రార్ధించే విధానం ఎమిటి? మరియు ప్రార్ధనలు దేవుని సన్నిధిలో స్వీకరింపబడు వేళలు ఎమిటి ఇలాంటి అన్ని ప్రశ్నలకు హదీసులలో విస్తృతమైన వర్ణన దొరుకుతుంది.
క్రుపాసీలుడైన అల్లాహ్ మరియు అతని యొక్క దయ అన్ని ప్రాణులకు దక్కుతుంది కాని దాని పొందే అర్హత ఎదుటివానిలో కూడా ఉండాలి,అందరి యొక్క ప్రార్ధనలు ఆ అల్లాహ్ సన్నిధిలో స్వీకరింపబడవు దానికి ఆటంకాలను స్వయాన ఈ మానవుడే సృష్టించుకుంటాడు.
ఇమాం అలి(అ.స్)ల వారు ఈ విధంగా దేవుని సన్నిధిలో వేడుకొంటున్నారు:
اللَّهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تَحْبِسُ الدُّعَاءَ وتُنْزِلُ الْبَلاَءَ
"ఓ భగవంతుడా! ఏ పాపాలైతే నా ప్రాధనను నీ దాక చేరకుండా అణచివేస్తాయో మరియు ఏ పాపాలైతే నా పై ఆపదలను కురిసేలా చేస్తాయో ఆ పాపలను క్షమించు"(దూఅయె కుమైల్ ఇబ్నె జియాద్).
ప్రార్ధనలు స్వీకరింపబడు వేళల గురించి ఇమాం అలి(అ.స)ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు:
ఐదు సమయాలలో మీ ప్రార్ధనలను స్వీకరింపజేయడానికి మేలుగా పరిగణించండి:
ఒకటి: ఖురాన్ పఠించే సమయంలో
రెండు: అజాన్ (నమాజ్ కై చేసే పిలుపు) సమయంలో
మూడు: వర్షం కురిసే సమయంలో
నాలుగు: జిహాద్(ధర్మయుద్దం) సమయంలో
ఐదు: బాధితులు బాధ లేదా దుఖపు సమయంలో.
ఇటువంటి సమయాలలో మీ ప్రార్ధనలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ అల్లాహ్ సన్నిధిలో స్వీకరింపబడతాయి.
రిఫరెన్స్:
[ఆమాలియె షేఖ్ సదూఖ్, పేజీ నం:97, బిహారుల్ అన్వార్, భాగం;90, పేజీ:343, హదీసు నం:1]
వ్యాఖ్యానించండి