శుక్ర, 07/03/2020 - 10:08
దైవప్రవక్త[స.అ] మరణానంతరం హజ్రత్ అలీ[అ.స] మౌనంగా ఉండడానికి వివరించిన కారణం...
అల్లాహ్, విశ్వాసుల నాయకులైన అలీ[అ.స]పై తన కారుణ్యాన్ని కురిపించు గాక!, తన పినతండ్రి కుమారుడు అయిన దైవప్రవక్త(స.అ) మరణం తరువాత ఖిలాఫత్ విషయం పై మౌనంగా ఉన్నారు.
నా ప్రాణం అతనికి అంకితం అతను ఇలా ప్రవచించెను: “నేను రెండు కార్యముల మధ్య ఆలోచిస్తూ ఉండిపోయాను, నేను విరిగిన చేయితో యుద్ధం చేయాలా లేక అంధాకారపు కష్టకాలం పై సహనంగా ఉండాలా. అందులోనే వయసుగలవారు వయోవృద్ధులవుతారు, పిల్లలు ముసలివారవుతారు, విశ్వాసులు అందులో కష్టాలకు గురిఅవుతారు మరియు చిక్కుల్లో పడతారు చివరికి వారు అల్లాహ్
ను కలుసుకుంటారు. వీటి పై సహనంగా ఉండటమే వివేకమైనదనిపించింది. కనుక కంటిలో ముల్లు మరియు కంఠంలో ఎముకలా ఉన్నప్పటికీ సహనాన్నే ఎంచుకున్నాను”.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి