సత్యం తనవైపు ఉన్నా మౌనంగా ఉన్న దైవప్రవక్త[స.అ] మరియు ఆ మౌనం యొక్క ఫలితాలు...
“హుదైబియహ్” యుధ్ధం
లో యదార్ధం పట్ల దైవప్రవక్త[స.అ] యొక్క మౌనం, ఖురైషీయుల షరత్తుల మరియు ముష్రికుల అసత్యాన్ని అంగీకరించడం, ఉమర్ ఇబ్నె ఖత్తాబ్
ను కోపాన్ని తెచ్చాయి. మరియు అతను దైవప్రవక్త[స.అ]తో ఇలా అన్నారు: నీవు నిజమైన దైవప్రవక్త[స.అ] కాదా!? సత్యం మా వైపు మరియు అసత్యం వాళ్ళ వైపు లేదా!? అయితే ఎందుకు మన దీన్
లో అప్రతిష్టతను అంగీకరించాలీ!?
ఒకవేళ దైవప్రవక్త[స.అ] మౌనంగా ఉండడం, ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ మరియు చాలా సహాబీయుల దృష్టిలో సరైన విషయం కాకపోయినా, నిజానికి ఆ మౌనం ఇస్లాం మరియు ముస్లిముల కొరకు చాలా లాభాలను తెచ్చిపెట్టింది. అప్పటికప్పుడే ఎటువంటి లాభం కనిపించనప్పటికీ, ఒక సంవత్సరం తరువాత దాని లాభాలు తెలిసొచ్చాయి. ఆ కాలంలో, దైవప్రవక్త[స.అ] ఎటువంటి యుద్ధం మరియు బలప్రదర్శన లేకుండా మక్కా పట్టణాన్ని జయించారు. మరియు జనం గుంపులు గుంపులుగా ఇస్లాను స్వీకరించారు. అప్పుడు దైవప్రవక్త[స.అ], ఉమర్ ఇబ్నె ఖత్తాబ్
ను పిలిచి అతనికి, హుదైబియా సంధినాడు తను సత్యాన్ని వెల్లడించకుండా మౌనంగా ఉన్న దాని గురించి మరియు వాటి లాభాల గురించి తెలియపరిచారు.
ఈ వాదనలు, నిదర్శనలు ప్రకటించడానికి గల కారణమేమిటంటే; “ఒకవేళ అసత్యానికి సహాయకులు మరియు సహాయం దొరికితే అది సత్యం పై విజయాన్ని పొందుతుంది. మరి ఇది యదార్ధం దీని నుండి తప్పించుకోలేము” అని తెలియపరచడం. అలీ[అ.స] సత్యం వైపు ఉన్నారు మరియు సత్యం ఎల్లప్పుడూ అతని వెంటే ఉండేది, కాని ముఆవియా యొక్క దుర్మార్గానికి ఎదురు తిరగడానికి సహచరులు పొందలేదు, అతడికి చాలా సహచరులు ఉండేవారు, అందుకని అతడు సత్యాన్ని తొక్కిపాడేయగలిగాడు. ప్రజలు ప్రపంచవాంఛలకు బానిసలు మరియు దీన్ కేవలం వాళ్ళ నోళ్ళకే పరిమితమయ్యింది. వాళ్ళు సత్యాన్ని ఇష్టపడేవారు కాదు. వాళ్ళు అసత్యాన్ని అనుచరించేవారు, ఎందుకంటే సత్యం, చేదైనది మరియు కష్టమైనది. కాని అసత్యం సులభమైనది మరియు తెలికైనది.
వ్యాఖ్యానించండి