.ఒక బుద్ధిమంతుడికి తనకు కలిగిన సందేహాల గురించి పరిశోధించి, పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు మనశాంతి కలగదు.
ఒక ధర్మాన్ని విచారించి దానిని అనుసరించడం మన కర్తవ్యం కాదు అని కొందరు భావిస్తూ ఉంటారు. అంతే కాదు వారు “ఒక ధర్మాన్ని పరిశోధించడంలో ఆందోళన చెందవలసినవసరం మనకు లేదు” అని అంటూ ఉంటారు. వారు ఈ రెండు విషయాలను తప్పకుండా గమనించాలి. అవి:
1. ప్రపంచంలో ఉన్న ప్రతీ బుద్ధిమంతుడికి, అతడిని కృతఘ్నుడు, మేలు మఱచువాడు అని సంభోధించబడడం ఇష్టం ఉండదు. అంతేకాకుండా అతనికి మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞుడిగా ఉండాలని అనుకుంటాడు.
2. ప్రతీ అపాయం మరియు కీడు నుండి తనను రక్షించుకోవడం అవసరం అది ఎటువంటి అపాయం అయిన సరే అని ప్రతీ బుద్ధిమంతుడు నమ్ముతాడు.
ప్రపంచంలో మనకు ఎన్నో అనుగ్రహాలు ప్రసాదించబడ్డాయి మరి ఈ అనుగ్రహాలన్నీ మనకు ఎవరు ప్రసాదించారు!, ఆ దయామయుడెవడో తెలియకపోతే కృతజ్ఞత ఎలా తెలుపుకోగలము! మేము వీటన్నీంటిని తెలుసుకోకపోతే మనకు ముందు ముందు ఏదైన అపాయం ఉందా! అన్న విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.
ఈ ప్రశ్నలకు సరైన జవాబు ఒక సంపూర్ణత్వం కలిగి ఉన్న ధర్మం మాత్రమే మనకు ఇస్తుంది. ఆ ధర్మం ఏ ధర్మమో ఈరోజు నుండే అన్వేషించడం మొదలు పెట్టండి.
వ్యాఖ్యానించండి