ఇమామ్ అలీ నఖీ(అ.స) యొక్క జ్ఞాన పరమైన సేవలు సంక్షిప్తంగా...
ఇమామ్ అలీ నఖీ(అ.స) యొక్క జ్ఞాన పరమైన సేవలు:
బనీ అబ్బాస్ అధికారంలో ఖలీఫాలు జ్ఞాన పరమైన మరియు సాంస్కృతిక అంశాల పట్ల ఆశక్తి చూపించేవారు. ఆ కాలంలో ఇతర దేశాల నుండి చాలా పుస్తకాలు అరబీ భాషలో అనువదించబడ్డాయి మరి ఇదే విషయం ప్రజల ఆలోచన విధానం మారిపోవడానికి కారణం అయ్యింది. అలాగే కలామ్(విశ్వాసాల సంభాషణ జ్ఞానం) వర్గాలు ఉదాహారణకు అషాయిరహ్ మరియు మోతజిలహ్ వర్గాల జోరు ఎక్కువయ్యింది; అల్లాహ్ కు శరీరం ఉందీ, మనిషికి స్వేచ్ఛలేదు అంతా అల్లాహ్ యే చేస్తాడు, ఖుర్ఆన్ అల్లాహ్ ఉన్నప్పటి నుండి ఉందా లేక తాజాగా అవతరింపబడినదా? లాంటి సందేహాలు పుట్టుకొచ్చాయి. ఇమామ్ ఇలాంటి సందేహాలకు జ్ఞాన పరంగా సమాధానం ఇచ్చి ముస్లిములు ఇలాంటి సందేహాల చిక్కులో చిక్కకుండా కాపాడేవారు.
ఇమామ్ అలీ నఖీ(అ.స) యొక్క సహచరులు:
1. ఫజ్ల్ ఇబ్నె షాజాన్:
ఇతను హిజ్రీ యొక్క 3వ శతాబ్ధానికి చెందిన ప్రముఖ షియా ముతకల్లిమ్(మత విశ్వాసాల పరంగా వ్యాజించే పండితుడు). ఇతను ఇమామ్ అలీ నఖీ(అ.స) యొక్క సహాచరుల నుండి లెక్కించబడతారు.
2. హజ్రత్ షాహ్ అబ్దుల్ అజీమె హసనీ(అ.స):
ఇతని వంశ వృక్షం ఇమామ్ హసన్(అ.స)కు చేరుతుంది. జ్ఞాన మరియు విశ్వాస పరంగా ఇమామ్ అలీ నఖీ(అ.స) తరపు నుండి సమ్మతించబడినవారు.
జియారతె జామిఅహ్ అల్ కబీరహ్ మరియు జియారతె గదీర్:
ఇమామ్ అలీ నఖీ(అ.స) నుండి చాలా దుఆలు మరియు జియారత్ పట్టికలు ఉల్లేఖించబడి ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి జియారతె జామిఅహ్ కబీరహ్ మరియు జియారతె గదీర్.
1. జియారతె జామిఅహ్ అల్ కబీరహ్:
ఈ జియారత్ యొక్క సనద్(రావీయుల క్రమం) సరైన సనద్. వాక్చాతుర్యం ప్రకారం కూడా చాలా గొప్ప స్థానం కలిగినది. ఈ జియారత్ పై అరబీ మరియు ఫార్సీ భాషలలో చాలా వివరణ మరియు వ్యాఖ్యాలు వ్రాయబడ్డాయి. ఇందులో ఉన్న అర్ధాలు చాల గొప్పవి.
2. జియారతె అల్ గదీర్:
ఈ జియారత్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇందులో హజ్రత్ అలీ(అ.స) యొక్క ప్రత్యేకతలు మరియు గదీర్ యొక్క సంఘటన వివరించబడి ఉంది.
ఇమామ్ అలీ నఖీ(అ.స) మరణం:
ఇమామ్ అలీ నఖీ(అ.స) ప్రాణాలతో ఉండడం మరియు వారు అప్పటి అధికారులతో కలిసి ఉండకపోవడం లాంటి వాటితో అధికారులు నిరంతరం భయానికి గురి అయి ఉండేవారు. దీనికి కేవలం వారిని హతమార్చడమే పరిష్కారం అని భావించారు. ఆ క్రమంలో ఇమామ్ అలీ నఖీ(అ.స)ను కూడా మనుపటి ఇమాములను విషమిచ్చి చంపినట్లే మోతజ్ అధికార కాలంలో చంపారు.(1)
ఇమామ్ అలీ నఖీ(అ.స) యొక్క ఇమామత్ పదవీ కాలం ఇంచుమించు 34 సంవత్సరాలు అనగా 220 హిజ్రీ(ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స)) మరణించిన సంవత్సరం) నుండి 254 హిజ్రీ వరకు. వారు సామెరహ్ లో చంపబడ్డారు. వారు మరణించిన తరువాత వారి జనాజహ్ నమాజ్ ను వారి కుమారులైన హజ్రత్ ఇమామ్ హసన్ అస్కరీ చదివించారు. వారిని వారి ఇంట్లోనే ఖననం చేశారు.
రిఫరెన్స్
పీష్వాయీ, సీరయె పీష్వాయాన్, భాగం2, పేజీ612.
వ్యాఖ్యానించండి