.షైఖ్ సదూఖ్[ర.అ] రచించిన గ్రంథం షియా హదీస్ మూల గ్రంథాలలో ఒకటిగా నిర్ధారించబడింది. ఇది ఫిఖా అహ్కాములకు సంబంధించిన హదీసులతో కూడిన గ్రంథం.
“మన్ లా యహ్జురుహుల్ ఫఖీహ్” గ్రంథాన్ని అబూ జాఫర్ ముహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె హుసైన్ ఇబ్నె బాబ్వై[ర.అ]. వారు షైఖ్ సదూఖ్ గా ప్రసిద్ధి చెందారు. "షైఖ్ సదూఖ్"[ర.అ]కు షియా వర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారు రచించిన గ్రంథం షియా హదీస్ మూల గ్రంథాలలో ఒకటిగా నిర్ధారించబడింది. ఇది ఫిఖా అహ్కాములకు సంబంధించిన హదీసులతో కూడిన గ్రంథం.
షైఖ్ సదూఖ్[ర.అ] ఇందులో ఇంచుమించు ఆరు వేల రివాయత్ లను ఉల్లేఖించారు. ఈ గ్రంథం నాలుగు భాగాలలో ఉంది. అవి:
1వ భాగంలో నీరు, దాని రకాలు, పవిత్రతా మరియు నమాజ్ కు సంబంధించిన రివాయత్ లు ఉల్లేఖించబడి ఉన్నాయి.
2వ భాగంలో జకాత్, ఉపవాసం, హజ్ మొదలగు వాటికి సంబంధించిన రివాయతులు ఉల్లేఖించబడి ఉన్నాయి.
3వ బాగంలో ఖాజా, వికాలత్, కిఫాలత్, వివాహం, విడాకులు, వేటా మరియు జపా చేయు విధానాలకు సంబంధించిన హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి.
4వ భాగంలో సరిహద్దులు, రక్తమూల్యం, పరిహారం మరియు వీలు నామాలు మొదలగు సంబంధించిన హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి.
చివరిలో మషీఖహ్ అను ఒక శీర్షికతో ఈ గ్రంథంలో ఉల్లేఖించబడిన హదీస్ రావీయుల క్రమాన్ని వివరించారు.
వ్యాఖ్యానించండి