ప్రవర్తన ప్రభావం

గురు, 11/25/2021 - 15:27

సద్గుణానికి నిలువెత్తు నిదర్శనం అయిన ఇమామ్ హసన్(అ.స) యొక్క ప్రవర్తన ఒక శత్రువుకు పై చూపించిన ప్రభావం...

ప్రవర్తన ప్రభావం

ఒకరోజు సిరియావాసుడు దైవప్రవక్త(స.అ) యొక్క సమాధి దర్శనానికై మదీనాలో ప్రవేసించాడు. అక్కడ గుర్రంపై కూర్చుని ఉన్న ఒక గొప్ప వ్యక్తిని చూశాడు. అతని చుట్టూ ఆజ్ఞకోసం అతని సహాబీయులు వేచి ఉన్నారు.
ప్రపంచంలో ముఆవియా కన్న ఎక్కువ ఘనత మరియు గౌరవం మరొకరికి ఉంటాయా, అని ఆ సీరియావాసుడు ఆలోచిస్తూ ఆశ్చర్యంగా ఉండి పోయాడు!. అతడు, ఇతనెవరూ? అని ప్రశ్నించాడు. ఇతను అలీ ఇబ్నె అబీతాలి(అ.స) కుమా రుడు హసన్(అ.స), అని బదులిచ్చారు. అబూతురాబ్ కుమారుడు, ఖారిజీ ఇతడే! అని చెప్పి, ఇమామ్ హసన్(అ.స) మరియు వారి తండ్రి మరియు కుటుంబసభ్యులను అపవాదించడం మరియు శపించడం మొదలు పెట్టాడు.
ఇమామ్ హసన్(అ.స) అనుచరులు ఖడ్గాలను ఒర నుండి తీసి అతడ్ని హతమార్చాలనుకున్నారు, కాని ఇమామ్ హసన్(అ.స) వారిని ఆపారు. గుర్రం పైనుండి దిగి క్రిందికి వచ్చి అతనికి స్వాగతం పలికి ఇలా అన్నారు: ఓ సోదరా! నీవు భాటసారివా? సీరియావాసుడు ఇలా అన్నాడు: అవును నేను అమీరుల్ మొమినీన్ మరియు ముస్లిముల నాయకుడైన ముఆవియా ఇబ్నె అబీసుఫ్యాన్ యొక్క అనుచరుడ్ని. ఇమామ్ హసన్(అ.స) మరలా అతడికి స్వాగతం పలికి ఇలా అన్నారు: నీవు ఈ రోజు నా అతిథివి. సీరియావాసుడు అంగీకరించలేదు, కాని ఇమామ్ హసన్(అ.స) అతను ఇంటికి రావడానికి అంగీకరించేంత వరకు వదలలేదు. ఇమామ్ స్వయంగా అతనికి అతిథి మర్యాదలు చేశారు. అతడు మూడు రోజుల పాటు ఇమామ్ ఇంట్లోనే ఉన్నాడు. నాలుగోవ రోజు అతడి ముఖంపై పశ్చాత్తాపం కనిపించింది, ఇమామ్ హసన్(అ.స)తో తాను చేసిన ఆ చెడు ప్రవర్తనకు బదులు అతని ఈ అతిథి మర్యాద మరియు సత్ప్రవర్తన చూసి ఇమామ్
తో క్షమాపణ కోరాడు. ఇమామ్
తో తనను క్షమించమని కోరాడు. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ:
ఇమామ్ హసన్(అ.స): ఓ సోదరా! నీవు ఖుర్ఆన్ చదివావా?
సీరియావాసుడు: నాకు పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం.
ఇమామ్ హసన్(అ.స): అల్లాహ్ అన్ని అపవిత్రతలను దురంగా ఉంచి పవిత్రులుగా నిర్ధారించిన ఆ అహ్లెబైత్(అ.స) ఎవరో నీకు తెలిసా?.
షామీ: అవును తెలుసు, అది ముఆవియా మరియు అబూసుఫ్యాన్ వంశీకులు!.
అక్కడున్న వారు ఆశ్చర్యపడ్డారు, కాని ఇమామ్ చిన్నగా నవ్వుతూ ఇలా అన్నారు: నేను “అలీ(అ.స)” కుమారుడు హసన్(అ.స)నీ, నా తండ్రి దైవప్రవక్త(స.అ) గారి పినతండ్రి కుమారుడు. నా తల్లి “ఫాతమా జహ్రా(స.అ)”, ఆమె ప్రపంచ స్త్రీలకు నాయకురాలు. నా తాతాగారు దైవప్రవక్త(స.అ), ప్రవక్తలందరి నాయకులు. నా పినతండ్రి సయ్యదుష్షుహదా “హంజా”. ఇంకో పినతండ్రి “జాఫరె తయ్యార్”. అల్లాహ్ ద్వార పవిత్రులుగా నిశ్చయించబడినటువంటి మరియు ముస్లిములపై మా ప్రేమను వాజిబ్ చేయబడినటువంటి ఆ వంశం, మాదే. మరి మాపై అల్లాహ్, ఆయన దూతలు దురూద్ పంపుతారు మరియు ముస్లిములకు మాపై దురూద్ పంపమని ఆదేశించబడినటువంటి వాళ్ళము. నేనూ, నా సోదరుడు స్వర్గయువకుల నాయకులం.  
ఇమామ్ హసన్(అ.స) క్రమంగా అహ్లెబైత్(అ.స)ల ప్రతిష్టతలను చెబుతూనే ఉన్నారు, చివరికి యదార్ధం అతడికి తెలిసోచ్చింది. సీరియావాసుడికి వారిపై ఇష్టం ఏర్పడింది మరియు ఏడ్పు మొదలు పెట్టాడు. ఇమామ్ హసన్(అ.స) యొక్క చేతులును పట్టుకొని ముద్దాడాడు మరియు తాను చెప్పిన మాటలపై క్షమాపణ కోరుతూ ఇలా అన్నాడు: అల్లాహ్ ప్రమాణంగా చెబుతున్నాను, మదీనాలో ప్రవేసించిన రోజు మిమ్మల్ని ద్వేషించినంతగా మరెవ్వరినీ ద్వేషించే వాడిని కాదు, కాని ఈరోజు మీ కన్న ఎక్కువ ఎవ్వరిని ఇష్టపడడం లేదు. మీపై ప్రేమ మరియు మీ అనుచరణ ద్వార అల్లాహ్
కు దగ్గరవ్వాలని అనుకుంటున్నాను, మరియు మీ శత్రువులను అసహ్యిస్తున్నాను.
ఇమామ్ తమ అనుచరులతో ఇలా అన్నారు: మీరు ఈ అమాయకుడిని చంపాలని అనుకున్నారు. ఒకవేళ అతనికి యదార్ధం తెలిసి ఉంటే ద్వేషించేవాడు కాదు. షామ్
లో ఉన్న చాలా మంది ఇటువంటి వారే, ఒకవేళ వాళ్ళు యదార్ధం తెలుసుకుంటే, దానిని అనుచరిస్తారు.
ఆ తరువాత ఈ ఆయత్
ను పఠించారు: “(నీవు) కేవలం హితభోధన (ఖుర్ఆన్)ను అనుచరించే వాడిని మరియు కరుణామయుడైన (అల్లాహ్)
ను చూడకుండానే భయపడేవాడిని మాత్రమే హెచ్చరించగలవు. కనుక అతనికి క్షమాభిక్షా, మహత్యమైన ప్రతిఫలమూ (లభిస్తాయానే) సుభవార్తను అందించు”.[యాసీన్ సూరా:36, ఆయత్:11][1]

అవును! చాలా మందికి ఈ యదార్థం తెలియదు. ఖేదించదగ్గ విషయమేటంటే చాలా మంది చాలా కాలం వరకు యదార్ధం పట్ల వైరం, శత్రుత్వం కలిగి ఉంటారు. కాని వాళ్ళకు మేము తప్పు పై ఉన్నాము అని తెలియగానే వెంటనే తౌబా మరియు అస్తగ్ఫార్ చేయడంలో నిమగ్నమౌతారు. మరి ఇది ప్రతీ మనిషి యొక్క కర్తవ్యం. ఎలాగైతే ఈ వచనం ఉందో “యదార్ధం వైపు అడుగు వేయడంలోనే శ్రేష్ఠత్వం ఉంది”.
దుస్థితి ఏవరిదంటే; తమ కళ్ళతో యదార్థాన్ని చూస్తారు, దానిని పూర్తిగా తమ అంతరార్మలో స్పర్సిస్తారు అయినా సరే తమ ప్రాపంచిక కోరికలు మరియు కనిపించని వైరం వల్ల యదార్ధంతో ఎల్లప్పుడూ యధ్ధం జరుగుతూనే ఉంటుంది.
ఇలాంటి వాళ్ళ గురించి అల్లాహ్ ఇలా ప్రవచించెను: “నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించకపోయినా వారికి ఒక్కటే; వారు విశ్వసించరు”.[యాసీన్ సూరా:36, ఆయత్:10]
వాళ్ళ కోసం సమయాన్ని పాడుచేసుకోవడం మరియు వాళ్ళ గురించి చింతించడం ద్వార ఎటువంటి లాభం లేదు. మేము యదార్ధాన్ని అన్వేషిస్తున్న మరియు యదార్థానికి చేరేందుకు కష్టపడుతున్న న్యాయవర్తుల కోసం ప్రతీదీ స్పష్టం చేయడమే మా కేవల కర్తవ్యం. ఇలాంటి వాళ్ళ గురించి అల్లాహ్ ఇలా ప్రవచించెను: “(నీవు) కేవలం హితభోధన (ఖుర్ఆన్)ను అనుచరించే వాడిని మరియు కరుణామయుడైన (అల్లాహ్)ను చూడకుండానే భయపడేవాడిని మాత్రమే హెచ్చరించగలవు. కనుక అతనికి క్షమాభిక్షా, మహత్యమైన ప్రతిఫలమూ (లభిస్తాయానే) సుభవార్తను అందించు”.[యాసీన్ సూరా:36, ఆయత్:11]

రిఫరెన్స్
1. అఖ్లాఖె ఇస్లామీ దర్ నెహ్జుల్ బలాగహ్, మకారిమ్ షీరాజీ, భాగం2, పేజీ49 నాసిర్, నస్లె జవాన్, ఖుమ్, 1385.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18